Qantas Airlines : లేని ఇంటికి.. అప్పటికే అమ్ముడు పోయిన స్థలాన్ని మళ్లీ అమ్మకాలకు పెట్టడం మనం చూస్తుంటాం. తెలంగాణలో ఇలాంటి మోసాలు చాలా ఎక్కువ. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ఇలాంటివి అధికమయ్యాయి. అలాంటి మోసానికే పాల్పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ విమానయాన సంస్థ. విమానంలో సీట్లు లేకపోయినా ఉన్నట్లుగా టికెట్లు విక్రయించింది. చివరకు రూ.550 కోట్ల జరిమానా చెల్లించేందుకు సిద్ధమైంది.
లాభాల కోసం అక్రమాలు..
ఆస్ట్రేలియా విమానయాన సంస్థ కాంటాస్ లాభాల కోసం అక్రమ విధానాలు అనుసరించింది. హోస్ట్ ఫ్లైట్స్ పేరిట ప్రాచుర్యం పొందిన కుంభకోణంలో 66 మిలియన్ డాలర్ల(రూ.550 కోట్లు) జనిమానా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ముందుగానే రద్దయిన విమానాల్లోని టికెట్లను సైతం కాంటస్ సంస్థ విక్రయిస్తూ వచ్చింది. ఈవిషయాన్ని సంస్థ స్వయంగా అంగీకరించింది. ఆస్ట్రేలియా నియంత్రణ సంస్థ తెలిపింది. దీంతో మిలియన్ డాలర్ల జరిమానాతోపాటు 86 వేల మంది ప్రయాణికులకు రూ.13 మిలియన్ఓ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. లాభాల కోసం కంపెనీ చేసిన నిర్వాకాన్ని ఆస్ట్రేలియా నియంత్రణ సంస్థ తప్పు పట్టింది. అనేక మంది వ్యాపారులు, పర్యాటకులు రద్దు చేసిన విమానాల్లో టికెట్లు బుక్ చేసుకుని నష్టపోయారని తెలిపింది.
రద్దయినా విక్రయాలు..
మూడు రోజుల ముందే రద్దయిన విమానాల టికెట్లు సైతం విక్రయించామని కాంటాస్ సంస్థ తెలిపింది. ప్రమాణాలు పాటించడంలో విఫలమయ్యామని పేర్కొంది. ప్రయాణికులకు సకాలంలో నోటిఫికేషన్లు పంపలేకపోయామని, ఇందుకు క్షమాపణ కోరుతున్నామని కాంటాస్ సీఈవో వనెస్సా హడ్సన్ తమ తప్పును అంగీకరించారు.
103 ఏళ్ల చరిత్ర..
ఇదిలా ఉంటే కాంటాస్ ఎయిర్లైన్స్కు 103 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంత పెద్ద సంస్థ అనైతిక విధానాలు అవలంబించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల ధరలు పెంచడం, సేవల నాణ్యతలో లోపాలు, కరోనా సమయంలో 1,700 మంది సిబ్బంది తొలగింపు వంటి అంశాల్లోనూ ఈ సంస్థ విమర్శలు ఎదుర్కొంది. గతేడాది కంపెనీ 1.1 బిలియన్ డాలర్ల లాభం ఆర్జించింది.