Bandla Ganesh: బండ్ల గణేశ్… కమెడియన్ గా, నిర్మాతగా ఆయనకు ఇండస్ట్రి లో మంచి పేరు ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల లోనూ, ఫంక్షన్ ల లోనూ ఆయన స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారంటే అతిశయోక్తి కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమానినని చెప్పుకునే బండ్ల గణేశ్ … మెగా ఫ్యామిలి ని బాగా ఇష్టపడతారని అందరికీ తెలిసిందే. అలానే రాజకీయాల పరంగాను ఎంట్రీ ఇచ్చి … పలు వ్యాఖ్యలతో మీడియా లో హాట్ టాపిక్ గా నిలిచారు. ప్రస్తుతం బండ్ల గణేశ్ హీరో గా ఓ సినిమాలో నటిస్తున్న విషయం కూడా మీడియా లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం పట్ల సినీ వర్గాల్లో మరోసారి చర్చించుకుంటున్నారు.
ఇటీవల ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని… బండ్ల గణేశ్ సందర్శించారు. ఈ మేరకు ఆయనను దర్శించుకున్న విషయాన్ని ట్విట్టర్లో అధికారికంగా పోస్ట్ చేశారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన వార్తను ప్రకటించారు బండ్ల. సచ్చిదానంద స్వామి జీవితంపై ఒక సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు గణేష్.
https://twitter.com/ganeshbandla/status/1452108703612616708?s=20
ఈ పోస్ట్ లో ” అప్పాజీ జీవిత చరిత్ర సినిమా చేసి తీరతా… ఆయన పాదాల సాక్షిగా అనుమతించారు. ఎవరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు” అంటూ స్వామీజీతో దిగిన ఫోటోను గణేష్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించి మరే వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా సచ్చిదానంద స్వామి పాత్రను ఎవరు పోషిస్తారు… తదితర సినిమా వివరాల గురించి సినివర్గాల్లో చర్చ మొదలైంది. రాజకీయాల నేపధ్యంలో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల … గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ లో కమెడియన్ గా నటించి మెప్పించారు. ఆయన హీరోగా చేస్తున్న ” డేగల బాబ్జీ ” చిత్రం డబ్బింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు ఇటీవలే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు గణేష్.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More