Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Ex-MLA Brahmanaidu arrested: కోట్ల భూమి కొట్టేసే పన్నాగం.. వైసిపి మాజీ ఎమ్మెల్యే ఇలా...

YSRCP Ex-MLA Brahmanaidu arrested: కోట్ల భూమి కొట్టేసే పన్నాగం.. వైసిపి మాజీ ఎమ్మెల్యే ఇలా తెలంగాణ పోలీసులకు చిక్కాడు

YSRCP Ex-MLA Brahmanaidu arrested: అది హైదరాబాద్ నగరం.. గండిపేట శివారు ప్రాంతం.. ఇక్కడ ప్రభుత్వానికి విస్తారంగా భూములు ఉన్నాయి. ఎకరం భూమి కోట్లల్లో పలుకుతూ ఉంటుంది. ఈ భూముల మీద ఓ వైసిపి మాజీ ఎమ్మెల్యే కన్ను వేశాడు. నకిలీ జీవోలు సృష్టించాడు. ఆ భూమిని మొత్తం కాజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చివరికి అతని పాపం పండింది.

గండిపేట ప్రాంతంలో 9 ఎకరాల 28 ప్రభుత్వ భూమిని దక్కించుకోవడానికి వైసిపి మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. తెర వెనుక బీభత్సమైన మంతనాలు జరిపాడు. సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో ఇతడి బాగోతం బయటపడింది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట గ్రామంలో సర్వేనెంబర్ 18లో ప్రభుత్వ భూమికి సంబంధించి ఇతడు నకిలీ జీవోలను సృష్టించాడు. వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. తన ఖాతా నుంచి 1.25 కోట్ల నగదును బదిలీ చేశాడు. ఇది కాస్త పోలీసుల అభియోగాలకు మరింత బలాన్ని ఇచ్చింది.

పోలీసులు ఈ కేసు వ్యవహారంలో కీలకమైన సమాచారాన్ని సేకరించారు. భూమిని కొట్టి వేయడానికి కుట్ర పన్నినట్టు ఆధారాల సేకరించారు. మొత్తం తొమ్మిది మంది మీద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బ్రహ్మనాయుడుని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేటకు వెళ్లారు. అక్కడ ఆయన లేరు.

ఈ వ్యవహారంలో మిగతా నిందితులు రమేష్, సునీల్, మరో ఇద్దరు కూడా పరారిలో ఉన్నారు. అయితే వీరంతా వివిధ రాష్ట్రాలు తిరిగారు. చివరికి పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ సాధారణంగా కాంచీపురంలో ఉన్నట్టు కనుక్కున్నారు. వారందరిని కూడా శుక్రవారం కాంచీపురంలో అరెస్ట్ చేశారు. ఈ కేసు కు సంబంధించి మరిన్ని వివరాలను తెలంగాణ పోలీసులు మీడియాకు వెల్లడించనున్నారు.

బ్రహ్మనాయుడి భూభాగోతం బయటపడిన నేపథ్యంలో టిడిపి నాయకులు స్పందిస్తున్నారు. తమ పార్టీ అధినేత మాదిరిగానే కిందిస్థాయి వ్యక్తులు కూడా అలానే చేస్తున్నారని.. ప్రభుత్వ భూములను మొత్తం నాశనం చేస్తున్నారని.. చివరికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను కూడా వదిలిపెట్టడం లేదని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. వైసిపి నేతల బాగోతం పక్క రాష్ట్రాల్లో కూడా బయటపడుతోందని.. ఇంతకంటే దారుణం మరొకటి ఏముంటుందని టిడిపి నేతలు అంటున్నారు. ఇటువంటి పార్టీకి ఓటు వేసి ప్రజలు మరోసారి మోసపోకూడదని.. ఒకసారి ఏపీలో అధికారంలోకి తీసుకొస్తేనే రాష్ట్రం అనేక సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని.. ఇంకా వీళ్ళకు అధికారం అప్పగిస్తే మరో బంగ్లాదేశ్ అవుతుందని టిడిపి నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version