spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP Party : వారితోనే వైసీపీకి నష్టం.. మౌనం కూడా వారిని ప్రోత్సహించినట్టే!

YCP Party : వారితోనే వైసీపీకి నష్టం.. మౌనం కూడా వారిని ప్రోత్సహించినట్టే!

YCP Party :  మనం తప్పు చేయకపోయినా.. మన ఎదురుగా జరుగుతున్న తప్పును సరిదిద్దకపోతే కచ్చితంగా మనమే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మన పేరుతో ఇంకొకరు అరాచకాలకు పాల్పడితే దానిని నియంత్రించాలి. అటువంటి వారికి దూరంగా ఉండాలి. లేకుంటే మూల్యం తప్పదు. గత ఎన్నికల్లో వైసీపీకి ఎదురైంది అదే. సోషల్ మీడియా యాక్టివిస్టులు కొందరు అతిగా ప్రవర్తించారు. అంతకుమించి జగన్ పేరును ఎక్కువగా వాడుకున్నారు. దీంతో ప్రతికూల ప్రభావం ప్రజల్లోకి వెళ్ళింది. వారు చేసే తప్పిదాలు వైసీపీకి అంటగాకాయి. ఎన్నికల్లో నష్టం చేకూర్చాయి.తటస్థ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి అటువంటి వారి వ్యాఖ్యలు. వైసిపి హయాంలో కొన్ని అసాంఘిక శక్తులు జగన్ పేరు చెప్పుకున్నాయి. పబ్బం గడుపుకున్నాయి. వీళ్ళ వికృతి చేష్టలకు నాటి ప్రభుత్వ పెద్దల మౌనం ప్రోత్సాహం గా మారింది. నోటికి ఎంత వస్తే అంత మాటలు ఆడే వైసీపీ నేతలు ఒకవైపు… ప్రత్యర్థులను రంగులు అంటగట్టి.. ఆ ఇంట్లో మహిళలను కించపరిచే సోషల్ మీడియా యాక్టివిస్టులు మరోవైపు వైసీపీకి నష్టం చేకూర్చారు. మరోవైపు జోష్యాలు, జాతకాలు.. ఇలా ఒక్కటేమిటి అన్ని విధాలా వైసిపిని డ్యామేజ్ చేసిన వారు ఉన్నారు.
* తాజాగా కడపకు చెందిన ఓ వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ పోస్టులు చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. అంత జుగుప్సాకరంగా ఉంటాయి ఆ పోస్టులు. ఆయన సోషల్ మీడియా యాక్టివిస్టే కాదు.. అధినేత కుటుంబానికి సహాయకుడు కూడా. అటువంటి వారు ఎంత హుందాగా ఉండాలి. ఈరోజు ఆయన అరెస్టు ద్వారా ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఆయన నీఛాతి నీచమైన భాష వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తిని తప్పు పట్టడమే కాదు.. ఆయనను ప్రోత్సహించడం వెనుక అధినేత ఉన్నారన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. అంతిమంగా అది పార్టీకి నష్టం చేకూరుస్తోంది.
* వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు ఓ రౌడీ షీటర్. తనకు తాను న్యాయవాదిగా చెప్పుకుంటూ ఆయన చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. చంద్రబాబు, లోకేష్ లను క్షణాల్లో లేపేస్తానని.. తాను అభిమానించే నేత పర్మిషన్ ఇచ్చిన మరుక్షణం వారిని చంపేస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పవన్ తో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులను సైతం కించపరిచారు. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. రిమాండ్ ఖైదీగా మారారు.
* మరో మహిళ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ ప్రత్యర్ధులపై విరుచుకుపడే క్రమంలో తాను ఒక మహిళ అనిమరిచిపోయి వ్యవహరిస్తుంటారు. మధ్య మధ్యలో అసభ్య పదజాలాలను వాడుకొని ప్రత్యర్థులను కించపరుస్తుంటారు. అయితే వీరంతా జగన్ అన్న అంటూ వైసీపీ అధినేత పేరు వాడుతుంటారు. అయితే ఇది వినేందుకు వినసొంపుగా ఉన్నా.. ఇటువంటి వారి ద్వారా వచ్చే నష్టం అంతు పట్టదు. గత ఎన్నికల్లో వైసీపీకి ఎదురైంది ఇదే. ఇటువంటి వారితోనే ఆ పార్టీకి భారీ డామేజ్ జరిగింది. ఇకనైనా ఇటువంటి వారిని దూరం పెడితే చాలా మంచిది. లేకుంటే మాత్రం హుందా రాజకీయాలను భ్రష్టు పట్టించిన వారు అవుతారు అనడంలో ఎటువంటి తప్పు లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper