spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు.. కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత ఇది..

Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు.. కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత ఇది..

Tirumala Laddu: సెలవు దినాలు కాదు. ఎండాకాలం సెలవులు కూడా ముగిసిపోయాయి. విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. అయినప్పటికీ తిరుమల భక్తులతో కిటకిటలాడుతూనే ఉంది.. తిరుమలలో ఎన్నడు లేని విధంగా ప్రస్తుత కాలంలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఆ సంఖ్య లక్షలకు చేరుకుంటున్నది. విఐపి దర్శనాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త నిబంధనలు తెరపైకి తీసుకురావడంతో సామాన్య భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కలిగింది..

ఇప్పుడు సెలవులు లేకపోయినప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వాస్తవానికి సెలవులు ముగిసిన తర్వాత తిరుమల కొండమీద భక్తుల సంఖ్య తగ్గుతుంది. కానీ భక్తులకు శీఘ్రంగా దర్శనం కల్పించే ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చేయడంతో రద్దీ విపరీతంగా ఉంటున్నది. కొన్ని సందర్భాలలో శిలా తోరణం వరకు భక్తులు వేచి ఉంటున్నారు. దీనిని బట్టి అక్కడ రద్దీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. శ్రీవారి లడ్డు ప్రసాదానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. తిరుమల శ్రీవారి లడ్డుప్రసాదం గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డులను సృష్టిస్తున్నది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు పెట్టే అన్న ప్రసాదం విషయంలో నాణ్యతను పాటిస్తోంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ తిరుమలలో పర్యటించినప్పుడు.. అన్న ప్రసాదం విషయంలో నాణ్యత తగ్గితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో దేవస్థానం బాధ్యులు అప్పటినుంచి అన్నప్రసాదంలో నాణ్యతను మరింత పెంచారు. ఇది కూడా భక్తుల సంఖ్య పెరగడానికి ఒక కారణం.

భక్తుల సంఖ్య లడ్డు ప్రసాదానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. తిరుమల శ్రీవారి లడ్డు గతంలో ఎన్నడు లేనివిధంగా రికార్డులను సృష్టిస్తున్నది. జూన్ నెలలో అత్యధికంగా లడ్డు ప్రసాదం విక్రయాలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఏప్రిల్ లో 1,11,96,170, మే నెలలో 1,21,35,528, జూన్ నెలలో 1,26,81,805 లడ్డూలను విక్రయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. 2024 జూన్ లో 1,02,54,364, గత ఏడాది జూన్ లో 1,19,21,353 లడ్డూలను దేవస్థానం విక్రయించింది. అయితే ఈ ఏడాది జూన్లో విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. గత ఏడాది జూన్ నెలతో పోల్చి చూస్తే ఈ జూన్ లో ఏకంగా 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయించింది తిరుమల తిరుపతి దేవస్థానం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version