Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: మేలో ఆ మూడు పథకాలు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

CM Chandrababu: మేలో ఆ మూడు పథకాలు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) సంక్షేమ పథకాల అమలు విషయంలో అనేక రకాలుగా ప్రచారం నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. దీనిపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు కురిపిస్తున్నారు. ఇంకోవైపు ప్రజల్లో కూడా చిన్నపాటి అసంతృప్తి ప్రారంభం అయింది. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సంక్షేమ పథకాల విషయంలో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మత్స్యకార భరోసా వంటి మూడు కీలక పథకాల షెడ్యూల్ ప్రకటించారు. దీంతో ఏపీలో సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ ప్రారంభమైనట్టే.

 

Also Read: రాజకీయాల నుంచి రాజ్ భవన్ కు.. ఆ సీనియర్ నేత ఆశ ఫలిస్తుందా?

 

* ఎన్నికల్లో హామీలు
ఈ ఎన్నికల్లో చంద్రబాబు( Chandrababu) చాలా వరకు హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. రెట్టింపు సంక్షేమం అందిస్తామని చెప్పుకొచ్చారు. అవసరం అయితే సంపద సృష్టించి మరి అందిస్తామని తేల్చి చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలకు సంబంధించి అమలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. కేవలం ప్రకటనలు మాత్రమే మిగిలాయి. ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షం తో పాటు రాజకీయ ప్రత్యర్థులు సంక్షేమ పథకాల విషయంలో విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లోనే చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

* మత్స్యకారులకు సైతం..
సాధారణంగా మేలో( may month) ఎండలు మండిపోతాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇప్పుడు అదే నెలలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. మత్స్యకారుల వేటనిషేధ సమయంలో అందించాల్సిన భృతితో పాటు రైతులకు ప్రోత్సాహం కింద నగదు అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పేరిట పథకం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు చంద్రబాబు. దీంతో ఈ మే నెల సంక్షేమ పండుగ కొనసాగనుంది.

* ఆ మూడు పథకాలు పేరు మార్చి
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో రైతు భరోసాగా అమలు చేసేవారు. కేంద్రం అందించే ఆరువేల రూపాయల నగదు తో పాటు మరో 7500 అందించి ఆదుకునేవారు. అయితే దానిని 20 వేల రూపాయలకు రెట్టింపు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మూడు విడతల్లో అందించేందుకు ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. గతంలో అమ్మ ఒడి పేరిట ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే 15 వేల రూపాయలు అందించేవారు. కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయల చొప్పున చదువు ప్రోత్సాహకానికి అందించనున్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో అందించే భృతిని కూడా మే నెలలో అందించేందుకు సిద్ధపడుతోంది కూటమి ప్రభుత్వం. మొత్తానికైతే సంక్షేమ పథకాల అమలు ప్రారంభం కావడం శుభపరిణామం.

 

Also Read: నేరుగా బెడ్ రూమ్ లోకి వచ్చి.. ఏపీ పోలీసులపై పోసాని భార్య సంచలన కామెంట్స్!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper