ఆంధ్రప్రదేశ్‌Visakhapatnam: విశాఖ ముగిసిన అధ్యయనం జగన్!

Visakhapatnam: విశాఖ ముగిసిన అధ్యయనం జగన్!

Visakhapatnam: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణం పై దృష్టి పెట్టింది. ఫలితాలు వచ్చిన నాడే సిఆర్డిఏ అధికారులు అమరావతి రాజధాని ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను, ముళ్ళ కంపలను తొలగించారు. విద్యుత్ వెలుగులు తెచ్చారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు అమరావతిలో పర్యటించారు. అమరావతిలో నిర్మాణాలపై అధికారులు నివేదిక ఇచ్చారు. అదే నివేదికతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పెద్దల సాయాన్ని అర్థించారు. అమరావతి నుంచి వెళ్లిపోయిన సంస్థలు తిరిగి రావడం ప్రారంభించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు సర్కార్ ఈ ఐదేళ్లలో అమరావతి రాజధానిని నిర్మించడం ఖాయం. అందుకే విశాఖ రాజధాని అంశం ముగిసిన అధ్యయనమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.

గతంలో జరిగిన పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కానివ్వరు చంద్రబాబు.అసెంబ్లీలో చట్టం తెస్తారు. కీలక నిర్మాణాలు పూర్తి చేస్తారు. రాజధానిగా ఒక రూపాన్ని తీసుకొస్తారు. భవిష్యత్తులో జగన్ తో పాటు ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధానిని మార్చేందుకు సాహసించని పరిస్థితికి తేనున్నారు. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొస్తారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండటంతో వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. మొన్న రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు కనుక జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మరోసారి అధికారంలోకి వచ్చినా..అప్పటికే రాజధాని నిర్మాణం పూర్తవుతుంది కనుక.. దానిని కదిలించే ప్రయత్నం చేయరు. దానిని కదిలించే ప్రయత్నం చేయడంతో ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకున్నారు ఆయనకు తెలియంది కాదు.

వాస్తవానికి రాజధాని తరలింపు అన్నది అంత ఆషామాషీ కాదు. మొన్నటికి మొన్న విభిన్న రాజకీయ కోణాలతో ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయంలో కలుగ చేసుకోలేదు. కానీఒకసారి రాజధాని నిర్మాణం పూర్తయితే మార్పు అంత ఈజీ కాదు. పార్లమెంట్ లో చట్టం చేయాలి. సభ ఆమోదం పొందాలి. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం ఆలస్యంగా రాజధాని నిర్మాణం ప్రారంభించింది. అన్ని పనులు నిర్మాణ దశలోనే ఉండిపోయాయి. అందుకే జగన్ విశాఖ రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ ఈ ఐదేళ్లలో కీలక నిర్మాణాలు పూర్తవుతాయి. శాశ్వత భవనాలు అందుబాటులోకి వస్తాయి. మరి రాజధాని మారుస్తామన్న ఆలోచన కూడా రాదు. ఒకవేళ జగన్ అధికారంలోకి వచ్చినా క్యాంపు కార్యాలయంతో విశాఖను సంతృప్తి పరచవచ్చు. అయితే అమరావతిలో శాశ్వత నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయి కనుక.. విశాఖ వెళ్లేందుకు కూడా ఛాన్స్ ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే విశాఖ రాజధాని ముగిసిన అధ్యయనం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Anil Kumar Yadav : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ షాక్ ట్రీట్మెంట్!

Anil Kumar Yadav : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు నాయకత్వ బాధ్యతలు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపడం...

YS Jagan Mohan Reddy : జగన్ తో ప్రశ్న రావణ్ కొలీగ్ గగన.. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఏం జరిగింది..

YS Jagan Mohan Reddy : రాజ ద్రోహం కేసులో అరెస్టయి జైల్లో ఉన్న రావణ్.. అలియాస్ జోసెఫ్ కు సంబంధించి ఏదో ఒక వార్త మీడియాలో కనిపిస్తూనే ఉంది. ఇటీవల కాలంలో...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...
Exit mobile version