Homeఆంధ్రప్రదేశ్‌TDP MLC BT Naidu : ఏపీ అసెంబ్లీ ఆవరణలో జేబుదొంగలు.. డబ్బులు పోగొట్టుకున్న టిడిపి...

TDP MLC BT Naidu : ఏపీ అసెంబ్లీ ఆవరణలో జేబుదొంగలు.. డబ్బులు పోగొట్టుకున్న టిడిపి ఎమ్మెల్సీ!

TDP MLC BT Naidu  : ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీల( elected MLC ) ప్రమాణ స్వీకార వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఎమ్మెల్యేల కోటా తో పాటు గ్రాడ్యుయేషన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురుతో శాసనమండలి చైర్మన్ ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగిన అసెంబ్లీ ఆవరణలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. జేబు దొంగలు రెచ్చిపోయారు. ఓ ఎమ్మెల్సీ తో పాటు ఆయన గన్మెన్, లాయరు, మరో వ్యక్తి వద్ద ఉన్న పర్సులను దొంగలించి షాక్కుకు గురి చేశారు. కొణిదల నాగబాబు, సోము వీర్రాజు, బీటీ నాయుడు, పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగానే కొందరు డబ్బులు పోగొట్టుకున్నారు.

Also Read : అమరావతికి గ్రాండ్ ఎంట్రీ.. ఏపీ ప్రభుత్వ సరికొత్త ఆలోచన!

* నాలుగు లక్షల రూపాయల చోరీ..
మొత్తం నాలుగు లక్షల కు పైగా చోరీ జరిగినట్లు తెలుస్తోంది. టిడిపి ఎమ్మెల్సీ బీటీ నాయుడు( TDP MLC BT Naidu ) దగ్గర పదివేల రూపాయలు, ఆయన గన్ మెన్ దగ్గర రూ.40,000, ఆయనతో వచ్చిన లాయర్ దగ్గర 50 వేల రూపాయలు, మరొకరి దగ్గర 32 వేల రూపాయలు చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. మరికొందరు దగ్గర సైతం కొద్ది మొత్తంలో నగదు చోరీకి గురైనట్లు సమాచారం. మొత్తంగా ఓ నాలుగు లక్షల రూపాయలకు దొంగలు టెండర్ పెట్టారు. అసెంబ్లీ ఆవరణలో దొంగతనం జరగడం ఇదే తొలిసారి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

* భారీగా తరలివచ్చిన శ్రేణులు
ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన బిజెపికి చెందిన సోము వీర్రాజు( Somveer Raju ), జనసేనకు చెందిన నాగబాబు, టిడిపికి చెందిన బిటి నాయుడులు ప్రమాణం చేశారు. పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ల సైతం ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తించే పార్టీ అని.. అందుకు ఉదాహరణ తానేనని చెప్పుకొచ్చారు. మరోవైపు ఎమ్మెల్సీలకు మద్దతుగా అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే జేబు దొంగలు రెచ్చిపోయారు.

* సీఎంను కలిసిన నాగబాబు..
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన నాగబాబు( Nagababu ) తన భార్య పద్మజతో కలిసి సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చంద్రబాబు నాగబాబును సాల్వతో సత్కరించి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు. అంతకుముందు చంద్రబాబును నాగబాబు దంపతులు సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు నేతల సూచనలకు అనుగుణంగా తన బాధ్యతలను నిబద్దతో నిర్వర్తిస్తానని చెప్పారు. అయితే తొలిసారిగా అసెంబ్లీ ఆవరణలో జేబు దొంగలు రెచ్చిపోవడం మాత్రం ఆందోళన కలిగించింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper