Guntur honey trap incident: అతని వయసు 6 పదులు దాటి చాలా రోజులైంది. వాస్తవానికి ఆ వయసుకు వచ్చిన వారంతా అనారోగ్యం సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇప్పటి కాలంలో అయితే బీపీలు, షుగర్లు కామన్ అయిపోయాయి. అంతటి వయసున్న ఓ వ్యక్తి దారితప్పాడు. అంకుల్ అని పిలిపించుకునే వయసులో.. ఏదో కావాలనుకున్నాడు. చివరికి అడ్డంగా బుక్ అయ్యాడు.
నేటి కాలంలో మోసాలు చేసేవారు మాయమాటలు చెబుతున్నారు. తియ్యగా మాట్లాడుతూ ఉన్నది మొత్తం ఊడ్చేస్తున్నారు. ఇక ఈ దందా లోకి ఆడవాళ్లు కూడా చేరిపోయారు. తీయగా మాట్లాడుతూ.. మాయ మాటలు చెబుతూ కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. ఇటువంటివారు పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్నప్పటికీ.. చాలామంది మారడం లేదు. పైగా మాయ మాటలు నమ్మి మోసపోతున్నారు.
గుంటూరు జిల్లాలో ఓ విశ్రాంత ఉద్యోగి వలపు వలలో చిక్కుకున్నాడు. ఫేస్ బుక్ లో అయిన పరిచయాన్ని వేరే విధంగా వాడుకుందామని అనుకున్నాడు. చివరికి అడ్డంగా బుక్ అయ్యాడు. ఏకంగా 1.09 కోట్లు మోసపోయాడు..
ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయిని అతడికి ఎరగా వేశారు. ఈ మోసం తెలియని అతడు ఆమె మాయమాటలకు లొంగిపోయాడు. ఆ మాయ లేడీ తనను తాను మౌనికగా పరిచయం చేసుకుంది. ప్రతిరోజు అతడికి వీడియో కాల్స్ చేసేది. చాటింగ్ కూడా చేసేది. చిన్న మొత్తాలతో భారీగా లాభాలు వస్తాయని.. పెట్టుబడులు పెట్టాలని అతడికి సూచించింది. ఆ అమ్మాయి వీడియో కాల్స్ చేయడం.. చాటింగ్ చేయడంతో ఆ విశ్రాంత ఉద్యోగి ఆమెకు దగ్గరయ్యాడు. తను జీవితకాలం సంపాదించిన డబ్బును మొత్తం ఆ అమ్మాయి చెప్పినట్టుగా వేరే వేరే ఖాతాలకు మళ్ళించాడు. మొదట్లో లాభాలు వచ్చాయని ఆ అమ్మాయి అతడికి చూపించింది. డబ్బులు డ్రా చేసుకోవాలని అతడు భావించగా.. ఆమె అనేక రకాల అడ్డంకులు సృష్టించింది. దీంతో మోసపోయానని భావించిన అతడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతడు డబ్బులు పంపించిన ఖాతాల వివరాలను పరిశీలించిన పోలీసులు ముగ్గురిని గుర్తించారు. ఆ అడ్రస్లలో పరిశీలిస్తే వారు కనిపించలేదు. దీంతో ఈ సైబర్ కేసును పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఆన్లైన్ ట్రేడింగ్ కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
