Professor Nageshwar: మీరు యుద్ధం ప్రారంభించారు.. నేను ముగిస్తాను అంటూ తేల్చి చెప్పారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇటీవల ఆయన చుట్టూ తెలుగు రాజకీయాలు నడుస్తున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యంలో జరిగిన చర్చ ఇది అంటూ ఆయన ఒక విశ్లేషణ చేశారు. చంద్రబాబు కంటే జగన్ నమ్మదగిన మిత్రుడు అని.. ఆయనను అరెస్టు చేయమన్న పవన్ కళ్యాణ్ ను అమిత్ షా క్లాస్ పీకినట్లు చెప్పుకొచ్చారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అప్పటినుంచి ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ తీరుపై కూటమి పార్టీలు మండిపడ్డాయి. ముఖ్యంగా జనసేన, టిడిపి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాయి. జనసేన నేతల ఫిర్యాదుతో కేసు నమోదు కూడా జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు ఉంటుందన్న ప్రచారం నడిచింది. అయితే తాను ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటించగా.. ఇంతటితో ఈ వివాదం ఫుల్ స్టాప్ అంటూ జనసేన ప్రకటించింది. అంతటితో ఆ వివాదం ముగిసిపోయిందని అంతా భావించారు.
* హైదరాబాదులో సమావేశం..
అయితే ఉన్నట్టుండి ప్రొఫెసర్ నాగేశ్వర్ యుద్ధం మీరు ప్రారంభించారు.. నేను ముగిస్తానంటూ ప్రకటన చేశారు. అది మొదలు మళ్లీ రచ్చ ప్రారంభం అయింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ కోసం హైదరాబాదులో ఏపీ పోలీస్ టీం దిగినట్లు ప్రచారం నడిచింది. అయితే రాజమండ్రిలో ఉన్న పవన్ కళ్యాణ్ ముందు రోజు గట్టిగానే మాట్లాడారు ప్రొఫెసర్ నాగేశ్వర్ పై. తరువాత రోజు మాట్లాడి వదిలేయండి నాగేశ్వర్ మంచివాళ్లు అంటూ చాలా ఈజీగా మాట్లాడారు. అరెస్టులు వద్దు అంటూ పోలీసులకు సూచించారు. దీంతో ఈ వివాదానికి పూర్తి సమాప్తం అన్నట్లు పరిస్థితి మారింది. అయితే ఉన్నట్టుండి మళ్లీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ రాజకీయ విశ్లేషకులతోపాటు జర్నలిస్ట్ ఫారం ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వారు పవన్ కళ్యాణ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. సినీ పరిశ్రమ వారిని తెగ దూషణలకు దిగారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై కూడా మాట్లాడారు.
* ఏపీ పాలకుల దాడిగా..
మీరు యుద్ధం ప్రారంభించారు నేను ముగిస్తాను అన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటన ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది. ఎందుకంటే ఇదంతా ఏపీ పాలకుల దాడిగా హైదరాబాదులో ఉన్న జర్నలిస్టులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ చేశారు. దానికి సంబంధించిన వివాదమే ఇదంతా. పైగా ఆయన హుందాగా తన మాటలను వెనక్కి తీసుకున్నారు. ఇంతవరకు ఆయన అరెస్టు కూడా జరగలేదు. అయినా సరే ఇప్పుడు తెలంగాణ సమాజం.. పెద్ద యుద్ధమే ప్రకటించడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినట్టు ఇది ఒక యుద్దం గా కనిపిస్తోంది. యుద్ధం ఆగుతుందా? లేకుంటే ఇంకా కొనసాగుతుందా? అన్నది చూడాలి.
