Homeఆంధ్రప్రదేశ్‌East Godavari : కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు బలి.. టీ పొడి అని...

East Godavari : కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు బలి.. టీ పొడి అని భావించి..*

East Godavari : ఆమెది ఏడు పదుల వయసు. కంటి చూపు సరిగా లేదు. టీ చేసే క్రమంలో టీ పౌడర్ బదులు..పొరపాటున పురుగుల మందు వేసింది.అలా తయారు చేసిన ఆ టీని వృద్ధ దంపతులు తాగారు. బలవర్మరణం పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది ఈ విషాద ఘటన. రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో వెలుచూరి గోవింద్(75),అప్పయమ్మ (70)అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. అప్పయమ్మకు సరిగ్గా కళ్ళు కనిపించవు. ఆమెశనివారం టీ చేసే ప్రయత్నం చేసింది.ఈ క్రమంలో టీ పౌడర్ బదులు పురుగుల మందు ప్యాకెట్ లో పౌడర్ ను వినియోగించింది. అలా తయారు చేసిన టీ తాగిన ఆ వృద్ధ దంపతులు నోటి నుంచి నురగలు కక్కుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వృద్ధ దంపతులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* ఒంటరిగా నివాసం
ఈ వృద్ధ దంపతులకు నలుగురు సంతానం.అందులో కుమారుడు రాజమండ్రిలో ఒక అపార్ట్మెంట్లో వాచ్ మాన్ గా పనిచేస్తున్నారు. అక్కడ దుస్తులు ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో వృద్ధ దంపతులు ఒంటరిగానే గ్రామంలో నివసిస్తున్నారు. ఊర్లో కుమార్తె వీరికి అండగా ఉంటూ వస్తుంది. శనివారం కుమార్తె లేకపోవడంతో ఆ వృద్ధురాలు టీ చేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

* కోతి విడిచి పెట్టిన వైనం
అయితే ఇటీవల ఒక కోతి పురుగు మందుల పొడితో ఉన్న ప్యాకెట్ను తీసుకొచ్చి ఇంటి ఆవరణలో పడేసింది. అది టీ పొడిగా భావించిఇంట్లో పెట్టారు.దానితోనే టీ చేసి విషాదాంతం పొందారు. తొలుత ఎందుకు అస్వస్థతకు గురయ్యారో తెలియని పరిస్థితి. టీ తాగడం తర్వాత నురగలు కొట్టుకోవడంతో స్థానికులు ఇంట్లో పరిశీలించగా.. టీ పొడి బదులు పురుగుమందుల పొడి వేసినట్లు గుర్తించారు.తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆ వృద్ధ దంపతులను ఆసుపత్రిలో చేర్పించారు.వైద్యులు ఎంత ప్రయత్నించినా వారిని కాపాడలేకపోయారు.

* ఎంతో అన్యోన్యంగా
ఆ వృద్ధులది అన్యోన్య దాంపత్యం.ఎంతో కలివిడిగా ఉండేవారు.వారిని చూసి విధికి కన్ను కొట్టిందేమో.. ఇలా పురుగుమందుల రూపంలో కబలించింది.ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version