ఆంధ్రప్రదేశ్‌Jagan: జగన్ ను చికాకు పెడుతున్న ఎమ్మెల్సీలు

Jagan: జగన్ ను చికాకు పెడుతున్న ఎమ్మెల్సీలు

Jagan: వైసీపీకి శాసనమండలి అచ్చి రావడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది.175 నియోజకవర్గాల గాను 151చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. దాదాపు 80% సీట్లను కైవసం చేసుకున్నారు. అయితే ఇన్ని సీట్లు సాధించిన వైసీపీకి శాసనమండలిలో బలం అంతంత మాత్రమే. దీంతో కీలక బిల్లులు, ప్రభుత్వ నిర్ణయాలపై గణనీయమైన ప్రభావం చూపింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో శాసనమండలిలో ప్రతి అంశంలోనూ చుక్కెదురయ్యింది. దీంతో ఒకానొక దశలో జగన్ శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం అనుమతి కోసం అర్జీ పెట్టుకున్నారు. అయితే విపక్షాలు న్యాయపోరాటం చేయడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. లేకుంటే శాసనమండలి ఏనాడో రద్దు అయ్యేది.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత శాసనమండలిలో వైసిపి ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. టిడిపి సభ్యులు పదవీ విరమణ తో వైసీపీకి ఛాన్స్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో స్థానిక సంస్థల కోట కింద జరిగిన ఎమ్మెల్సీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల సంఖ్య కూడా పెరిగింది. అయితే దీంతో జగన్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. శాసనమండలిలో ఒక్క వైసీపీ సభ్యులే కనిపించాలన్న ఆత్రం పెరిగింది. ఈ తరుణంలోనే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులు కాల్చుకున్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించింది. అప్పటి నుంచే వైసీపీ ప్రభుత్వం పై నెగిటివ్ టాక్ ప్రారంభమైంది.

గత ఎన్నికల్లో తన కోసం పని చేశారని, ఈ ఎన్నికల్లో పనిచేస్తారని చాలామంది నేతలకు జగన్ ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పదవులు ఇచ్చారు. అయితే ఇలా పదవులు దక్కించుకున్న వారు ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా మారారు. మరో అధికార కేంద్రంగా తయారయ్యారు.దీంతో వైసీపీలో విభేదాలకు ఇదే ప్రధాన కారణంగా మారింది. తొలుత జగన్ లైట్ తీసుకున్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీలు సొంత పార్టీ ఎమ్మెల్యే పై అసమ్మతి వ్యక్తం చేస్తూ వర్గ పోరుకు కారణమయ్యారు. ఎన్నికల ముంగిట ఇదో ఇబ్బందికర పరిణామమే.

మరోవైపు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఇప్పటికీ వీడుతూనే ఉన్నారు. తొలుత విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీని వీడారు. జనసేనలో చేరారు. ఆయనకు ఇంకా పదవీకాలం ఉన్నా.. తృణప్రాయంగా విడిచిపెట్టారు. తరువాత కడపకు చెందిన సి.రామచంద్రయ్య పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. అటు తరువాత హిందూపురంలో బాలకృష్ణ పై పోటీ చేసిన ఇక్బాల్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. బాలకృష్ణ పై ఓటమి తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీని వీడారు. ఇటీవల జంగా కృష్ణమూర్తి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన నేతల్లో కృష్ణమూర్తి ఒకరు. రాష్ట్రంలో బీసీ నేత కూడా.

విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రఘురామరాజు పార్టీకి అంటీ ముట్టునట్టుగా ఉన్నారు. ఈయన శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందినవారు. వైసిపి టికెట్ ఆశించారు. దక్కకపోయేసరికి ముందుగా తన అనుచరులను టిడిపిలోకి పంపించారు. మండల ఉపాధ్యక్షురాలు గా ఉన్న భార్యను సైతం టిడిపి తీర్థం పుచ్చుకునేలా చేశారు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఆయన వైసీపీలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఆది నుంచి శాసనమండలి వ్యవస్థ జగన్ ను చికాకు పెడుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...
Exit mobile version