పెళ్లైన నెలకే గర్భం దాల్చిన మహిళ.. చివరకు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మెడిసిన్ చదువుతున్న మహిళ భర్త అనుమానానికి, అత్తామామల వేధింపులకు బలైంది. పెళ్లైన నెల రోజులకే గర్భం దాల్చడంతో ఆమెకు అత్తింటి కుటుంబ సభ్యుల నుంచి అనుమానంతో వేధింపులు మొదలయ్యాయి. దీంతో సదరు మహిళ నిన్న చనిపోయింది. అయితే మహిళ ఆత్మహత్య చేసుకుందో ఎవరైనా హత్య చేశారో తెలియాల్సి ఉంది. Also Read: జగన్ కు కేంద్రం షాక్: దోస్తీ అంటూనే ఫుట్ బాల్ ఆడేస్తున్నారు పూర్తి […]

Written By: Navya, Updated On : November 27, 2020 3:18 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మెడిసిన్ చదువుతున్న మహిళ భర్త అనుమానానికి, అత్తామామల వేధింపులకు బలైంది. పెళ్లైన నెల రోజులకే గర్భం దాల్చడంతో ఆమెకు అత్తింటి కుటుంబ సభ్యుల నుంచి అనుమానంతో వేధింపులు మొదలయ్యాయి. దీంతో సదరు మహిళ నిన్న చనిపోయింది. అయితే మహిళ ఆత్మహత్య చేసుకుందో ఎవరైనా హత్య చేశారో తెలియాల్సి ఉంది.

Also Read: జగన్ కు కేంద్రం షాక్: దోస్తీ అంటూనే ఫుట్ బాల్ ఆడేస్తున్నారు

పూర్తి వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాలోని మడకశిరకు చెందిన 26 సంవత్సరాల అర్షియా మెడిసిన్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు కూతురు పెళ్లీడుకొచ్చిందని హిందూపురం ఆర్టీసీ కాలనీలోని నూరుల్లా అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్లి చేశారు. గతేడాది వివాహం జరగగా లక్షల్లో కట్నం, బంగారం ఇచ్చి గ్రాండ్ గా పెళ్లి చేశారు. అయితే పెళ్లి జరిగిన 30 రోజులకే మహిళ గర్భం దాల్చింది.

Also Read: ఫైట్ కు రె‘ఢీ’ అవుతున్న జగన్, చంద్రబాబు

దీంతో అత్తింటి వారి నుంచి వేధింపులు పెరిగాయి. బిడ్డ పుట్టిన తరువాత కూడా అత్తింటి వాళ్లి అదనపు కట్నం కోసం వేధించసాగారు. మంగళవారం రోజున ఆమె పుట్టినరోజు కాగా ఆరోజు కూడా ఆమెపై వేధింపులు కొనసాగాయి. తల్లిదండ్రులు ఫోన్ చేసినా ఆమె సరిగ్గా మాట్లాడలేదు. మరుసటిరోజుకు ఆమె చనిపోయి ఉంది. అత్తింటి వాళ్లు తమకేం తెలీదని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం: ఏపీ పాలిటిక్స్

ఇంటి పై కప్పుకు అర్షియా ఉరి వేసుకోగా ఆమెది హత్యో ఆత్మహత్యో తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమకు పోలీసులు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని మృతురాలి తల్లి, సోదరుడు చెబుతున్నారు.