spot_img
Homeఆంధ్రప్రదేశ్‌New Liquor policy :చివరి నిమిషంలో.. ఏపీ మద్యం టెండర్లలో బిగ్ ట్విస్ట్

New Liquor policy :చివరి నిమిషంలో.. ఏపీ మద్యం టెండర్లలో బిగ్ ట్విస్ట్

New Liquor policy : ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలకు దరఖాస్తులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ప్రభుత్వం గడువు పొడిగించింది.ఈనెల 11 వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చింది.14న లాటరీ తీయనుంది.16 నుంచి కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపడుతోంది. అయితేతొలుత గడువు తేదీన నిర్ధారించిన 9వ తేదీ నాటికి..రాష్ట్రవ్యాప్తంగా 57,709 దరఖాస్తులు వచ్చాయి.దరఖాస్తు రుసుముతో 1154 కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు సమకూరింది.2017 మద్యం పాలసీతో పోలిస్తే ఆదాయం మూడు రేట్లు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.రేపటి వరకు గడువు ఉండడంతో దరఖాస్తులు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.అయితే దరఖాస్తులు తగ్గడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలే కారణమని ఆరోపణలు వచ్చాయి.అనుకూల మీడియాలో సైతం ఇదే కథనాలు వచ్చాయి. దీంతో సీఎం చంద్రబాబు స్పందించారు.టెండర్లలో జోక్యం చేసుకుంటున్న నేతలకు హెచ్చరికలు జారీచేశారు.దీంతోదరఖాస్తులు ఊపందుకోవడం విశేషం.

* రూ.2000 కోట్ల ఆదాయం సమకూరేలా
రాష్ట్రవ్యాప్తంగా 3396 షాపులకు గాను..లక్ష దరఖాస్తులు వస్తాయనిప్రభుత్వం అంచనా వేసింది.నాన్ రిఫండబుల్ రుసుము రూపంలో 2000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు భావించారు.అయితే చాలా ప్రాంతాల్లో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి.కూటమి ప్రజాప్రతినిధుల జోక్యంతోనే దరఖాస్తులు తగ్గాయని ప్రచారం జరిగింది.దీంతో అటువంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపింది.దీంతో నేతల జోక్యం తగ్గింది.మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ మొదలైంది.

* చివరి మూడు రోజుల్లో
అయితే చివరి మూడు రోజుల్లో 37వేల దరఖాస్తులు రావడం విశేషం. రేపు సాయంత్రం వరకు గడువు ఉంది. దీంతో దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. మితిమీరిన రాజకీయ జోక్యంతో మొదట్లో చాలా స్వల్ప సంఖ్యలో దరఖాస్తులు అందాయి. దీనిపై ఎక్సైజ్ శాఖలోనూ ఆందోళన వ్యక్తం అయింది. నేరుగా సీఎంవో కార్యాలయం నుంచి సదరు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు రావడంతో వారు వెనక్కి తగినట్లు తెలుస్తోంది. అయితే ఆఫ్లైన్లో కంటే ఆన్లైన్లోనే అధికంగా దరఖాస్తులు రావడం విశేషం. 2017లో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించింది. ఆ సమయంలో దరఖాస్తు రుసుముగా రూ. 25 వేలు, రూ. 50 వేలుగా ఉండేది.అప్పట్లో 76,329 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి 473 కోట్ల ఆదాయం సమకూరింది.ఇప్పుడు దానికి దాదాపు మూడు రెట్లు ఆదాయం పెరిగింది.అయితే ఇప్పటికీ చాలా జిల్లాల్లో దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...

US Iran War: ఇరాన్‌ యుద్ధానికి 95 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌.. అమెరికా కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం!

US Iran War: అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. శాంతి ఒప్పంద ప్రకారం ఇరాన్‌ నడుచుకోవడం లేదని అమెరికా...

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Oktelugu Epaper
Exit mobile version