Homeఆంధ్రప్రదేశ్‌Janasena Plenary: జనసేన ప్లీనరీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఊహించని చేరికలు!

Janasena Plenary: జనసేన ప్లీనరీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఊహించని చేరికలు!

Janasena Plenary: జనసేన ప్లీనరీ( Jana Sena pleenary) నేడు పిఠాపురంలో జరగనుంది. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనసేన ప్లీనరీ ఈసారి రాజకీయంగా కూడా ఆసక్తిని పెంచుతోంది. జనసేన పవర్ లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీ కావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. అందులోనూ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ప్లీనరీ నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారిగా పవన్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అటువంటి చోట రాష్ట్రస్థాయి సభను ఒక పార్టీ నిర్వహించడం కూడా ఇదే తొలిసారి. ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది జనసైనికులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనాలు తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Also Read: అప్పట్లో పోసాని బయటపడతారా? ఆర్జీవి భయం అదే!

* భారీగా చేరికలు
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నుంచి చాలా చేరికలు ఉంటాయని భావిస్తున్నారు. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు సైతం పవన్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది. లక్షలాది మంది వచ్చే సభలో జనసేన బలం ఇదని నిరూపించే విధంగా ఈ చేరికలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే చేరికల విషయంలో జనసేన నేతలు బయటపెట్టట్లేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం షాక్ కు గురయ్యేలా చేరికలు ఉండబోతున్నాయని మాత్రం తెలుస్తోంది. అసలు వీరు పార్టీ మారుతారా? అని సందేహించే నేతలు సైతం జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

* రాయలసీమ నుంచి
అయితే ఈసారి రాయలసీమ( Rayalaseema) నుంచి భారీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రిని చేర్చుకునేందుకు మాజీ మంత్రి బాలినేని పావులు కదిపినట్లు తెలుస్తోంది. మరోవైపు పిఠాపురానికి చెందిన వంగా గీత, పెండ్యం దొరబాబు, మాజీ మంత్రి తోట త్రిమూర్తులు తదితరులు జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే మాత్రం సాగుతోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నేతలు పెద్ద ఎత్తున చేరే అవకాశం కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని సైతం జనసేనలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం ఇటీవల పావులు కదిపింది. కచ్చితంగా భారీగా చేరికలు ఉంటాయని మాత్రం తెలుస్తోంది.

* మెగా ఫ్యామిలీ రాక
మరోవైపు జనసేన ప్లీనరీకి మెగా కుటుంబం( mega family) నుంచి ప్రముఖులు వస్తారని ప్రచారం జరుగుతోంది. జనసేన నేతగా మెగా బ్రదర్ నాగబాబు రావడం ఖాయం. అదే సమయంలో మెగా కాంపౌండ్ వాల్ కు చెందిన యువ హీరోలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండడం.. జాతీయస్థాయిలో సైతం బిజెపితో అత్యంత స్నేహితుడిగా కొనసాగుతుండడంతో పవన్ కళ్యాణ్ బిజెపి పెద్దలను సైతం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయి నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు సైతం వస్తారని జనసేన నేతలు చెబుతున్నారు.

 

Also Read: జనసేన ‘జయకేతనం’.. ప్రత్యేక ఏర్పాట్లు ఇవే!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version