spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan: కులగణనను జగన్ సర్కార్ సొంతానికి వాడుతోందా?

Jagan: కులగణనను జగన్ సర్కార్ సొంతానికి వాడుతోందా?

Jagan: ఒక్క సంక్షేమ పథకాలలో తప్ప ఇతర విషయాలను జగన్ సర్కార్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ వాటిని ఉన్నపలంగా విడిచిపెట్టారు. తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కుల గణన విషయంలో చేతులెత్తేశారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు కులగణను చేపట్టాయి. అందులో ఏపీ కూడా ఉంది. అయితే ఎందుకో ఈ కులగణనను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు సర్వేలో సేకరించిన వివరాలు ఎక్కడికి వెళ్లాయి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగులుతోంది.

కుల గణన పేరుతో చేపట్టిన సర్వేలో పెద్ద అవినీతి ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలల కిందట రామ్ ఇన్ఫోకు చెందిన ఎఫ్ఏఓ సంస్థకు సర్వే డేటా ప్రాసెస్ బాధ్యతలను అప్పగించారు. గత నెల 20 వరకు కులగణన సర్వే ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. దీని నిర్వహణ బాధ్యతను ప్రణాళిక శాఖ చూసింది. కానీ సర్వే చేసింది మాత్రం సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లే. అప్పట్లో సమగ్ర సర్వేను చేపడుతున్నామని.
.. ఈ కుల గణన దేశానికి ఆదర్శమని.. దీనిని ఒక పుస్తక రూపంలో తెస్తామని చెప్పుకొచ్చారు. ఇలా సేకరించిన వివరాలన్నీ డేటా ప్రాసెస్ చేసే ఎఫ్ఎఓ సంస్థకు చేరిపోయాయి. అయితే సదరు సంస్థతో కాంట్రాక్టు నిలిపివేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే చేరాల్సిన సమాచారం చేరిపోయింది. అధికారికంగా కులగణనను పక్కన పెట్టామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఇదో గందరగోళ కార్యక్రమం గా మిగిలిపోయింది. కానీ ఇప్పటికే ప్రజలకు సంబంధించి డేటా చోరీకి గురైందన్న అనుమానం కలుగుతోంది.

అయితే ఈ సర్వేలో కేవలం కులాల వివరాలే సేకరించలేదు. ఆర్థిక పరిస్థితి, ఆస్తులు, ఇళ్లలో ఉండే పశువులు, గొర్రెలు, వంట కోసం వినియోగిస్తున్న గ్యాస్, విద్యుత్ స్టవ్, వంట చెరుకు, గోబర్ గ్యాస్, బయో ఇంధనం వంటి వాటి వివరాలను సమగ్రంగా తెలుసుకుని సర్వే పూర్తి చేశారు. ఆదాయ వనరులు, వారికున్న వ్యవసాయ భూమి, ఇల్లు వంటి వాటిపైన వివరాలతో పాటు అంతకుమించి ఆస్తిపాస్తులు ఉన్నా.. సమగ్రంగా వివరాలను సేకరించారు. అయితే ఇది కుల గణన కోసం చేసినది కాదని.. రాజకీయ లబ్ధి కోసమేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వివరాల సేకరణ తరువాత కుల గణనను నిలిపివేయడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇలా చోరీ చేసిన డేటా ఎక్కడికి వెళ్లిందన్న అనుమానం సర్వత్ర నెలకొంది. దీనిని నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Oktelugu Epaper
Exit mobile version