ఆంధ్రప్రదేశ్‌IT industry : బాబుకు క్రెడిట్ ఇస్తావా? జగన్ ఇది చేస్తావా?

IT industry : బాబుకు క్రెడిట్ ఇస్తావా? జగన్ ఇది చేస్తావా?

IT industry : కొవిడ్ తరువాత ఐటీ ఉద్యోగాల్లో మార్పు వచ్చింది. వర్క్ ఫ్రం హోం సంస్కృతితో ఐటీ సంస్థలు గణనీయంగా ఖర్చును తగ్గించుకున్నాయి. అటు సంస్థలకు ఖర్చు తగ్గటమే కాకుండా.. ఉద్యోగులు సొంత గ్రామాల్లోనే ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ తరుణంలోనే ఐటీ సంస్థలు ఒక ఆలోచనను పదునుపెట్టాయి. సెకండరీ గ్రేడ్ నగరాల్లో ఐటీ సంస్థలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? అని ఆలోచిస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదులో మాత్రమే ఐటీ ఉద్యోగాలు ఎక్కువగా కల్పించబడుతున్నాయి. ఏపీకి సంబంధించి ఎంతోకొంత విశాఖలో ఐటీ సంస్థలు ఏర్పటవుతున్నాయి. కానీ ఆశించిన స్థాయిలో ఎంప్లాయిమెంట్ దక్కడం లేదు. ఇటువంటి తరుణంలో ఐటీ సంస్థలు తీసుకున్న నిర్ణయం.. ఏపీ పాలిట స్వర్గధామం గా నిలవనుంది. ఏపీకి సంబంధించి విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో ఐటి అభివృద్ధికి అవకాశం ఉంది. ఆయా సంస్థలు ఆసక్తి చూపుతున్నందున.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే మన రాష్ట్రం కూడా ఐటీ పరంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుకునే ఛాన్స్ ఉంది.

వైసిపి ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు తరలిపోతున్నాయి అన్న అపవాదు ఉంది. దానిని అధిగమించాలంటే ఐటీ సంస్థలను ఆహ్వానించి చేయూతనందించాల్సిన అవసరం ఉంది. స్వల్ప కాలంలోనే ఐటీ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. వీలైనంత త్వరగా జగన్ సర్కార్ స్పందిస్తే.. పదుల సంఖ్యలో ఐటీ సంస్థలు ఏపీకి తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏపీకి రావడానికి ఆసక్తి చూపుతున్న సంస్థలను సైతం ఆహ్వానిస్తే.. వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఐటీ కంపెనీలు ప్రస్తుతం తరలి వస్తే మాత్రం.. దాని ఫలితం అనుభవించేది మాత్రం తర్వాత వచ్చే ప్రభుత్వమే. గతంలో చంద్రబాబు హయాంలో జరిగింది కూడా అదే. హైటెక్ సిటీని అంతకు ముందున్న ప్రభుత్వాలు ప్రారంభించాయి. దానిని చంద్రబాబు పూర్తి చేయడంతో.. ఆ క్రెడిట్ అంతా ఆయనకే లభించింది. ఇప్పుడు ఏపీలో ఐటీ సంస్థల పరిస్థితి కూడా అదే. ఇప్పుడు గానీ ఐటీ సంస్థల ఏర్పాటు ప్రారంభం జరిగితే.. ఆ క్రెడిట్ మాత్రం 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ లెక్కన జగన్ ఆ క్రెడిట్ దక్కించుకుంటారా? లేక చంద్రబాబుదా? అన్నది తేలాల్సి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version