Homeఆంధ్రప్రదేశ్‌Joseph Ravan Arrest: ఏపీ పై కేంద్రం సీరియస్!

Joseph Ravan Arrest: ఏపీ పై కేంద్రం సీరియస్!

Joseph Ravan Arrest: సాధారణంగా నాస్తికులు అంటే దేవుడిని నమ్మరు. ప్రతి మతంలోనూ ఉంటారు ఇలాంటి నాస్తికులు. కానీ ఇప్పుడు మరో రకమైన నాస్తికత్వం కనిపిస్తోంది. అదే మతతత్వం మాటున. సోషల్ మీడియా విస్తృతం అయ్యాక.. ఇలా మతపరమైన ప్రేరేపిత కుట్రలు పెరిగాయి. నాస్తికత్వం మరో మతంపై అనుచిత వ్యాఖ్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. బహుశా ఏపీలో ఇప్పటివరకు ఆ పరిస్థితి లేదు. కానీ జోసఫ్ రావణ్ లాంటి వారితో ఈ పరిస్థితి జరిగింది. అయితే ఏ మతం పైన అయినా… ఏ దేవుళ్ళ పైన అయినా.. అనుచిత వ్యాఖ్యలు చేస్తే అది ముమ్మాటికీ నేరమే. దానిని ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే ఏపీలో జోసెఫ్ రావణ్ అరెస్టు వెనుక రాజకీయ కోణం ఉందనేది కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణ. ప్రధానంగా ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ మద్దతుగా మాట్లాడుతోంది. ఈ తరుణంలో ఏపీలో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

* ఆందోళనలో అనుబంధ సంస్థలు..
సాధారణంగా బిజెపి అంటేనే హిందుత్వవాదం అని ఎక్కువ మంది భావిస్తారు. అలానే నడిచింది వారి రాజకీయాలు. విశ్వహిందూ పరిషత్ తో పాటు ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ వంటి అనుబంధ సంఘాలు హిందుత్వ వాదాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళుతుంటాయి. ఈ తరుణంలో ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూసి బిజెపి అనుబంధ సంస్థలు ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఇక్కడ విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ సమర్ధించడం పై కూడా తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం హిందుత్వవాదం పై కుట్ర జరుగుతోందన్న అనుమానం కేంద్రంలో ఉంది. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం ఈ వాదాన్ని విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్రం కన్నెర్ర జేసే అవకాశం ఉంది.

* కేంద్రం అనుమతితో..
ఏపీలో దళిత క్రైస్తవ శంఖారావసభలో జోసెఫ్ రావణ్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆయనపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేసి అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. ఒక కేసులో బెయిల్ దక్కుతుంటే… మరో కేసులో అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించిన ఓ చట్టంలో ఉన్న కేసును ప్రయోగించారు. ఈ కేసులో ఆయనకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశం లేదు. అయితే ఈ కేసు నమోదు వెనుక కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉంది అనేది ఒక విశ్లేషణ. ఏపీలో మతపరంగా జరుగుతున్న కుట్రలపై కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది. దేశ సమైక్యత భావానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో.. మత విద్వేషాలకు ఏపీ వేదిక అవుతుండడాన్ని.. కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Bike Mileage Tips: బండి మైలేజ్ కోసం సూపర్ 5 టిప్స్.. డబ్బులు బాగా సేవ్ అవుతాయి..

Bike Mileage Tips: ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొత్తగా టూ వీలర్ కొనాలని అనుకునేవారు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే వాహనాల వైపు చూస్తున్నారు. అయితే...

Jogi Rajeev: చంద్రబాబుకు మానసిక, శారీరక సమస్య.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ వ్యాఖ్యల వీడియో వైరల్..

Jogi Rajeev: ఫ్యాన్ పార్టీలో ముఖ్య నాయకుడు, నోటి దురుసు బిరుదాంకితుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వ్యవహారం కొద్ది రోజులుగా ఏపీ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ఇతడు సూర్యాపేటకు...

Pakistan Democracy: పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం కనుమరుగు.. – రాజ్యాంగ సవరణతో అధికారాలు పాక్ ఆర్మీ చీఫ్ కు..

Pakistan Democracy: పాకిస్తాన్‌ చరిత్రలో సైన్యం ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇటీవలి రాజ్యాంగ సవరణలు, ముఖ్యంగా 27వ సవరణ, ఆ ఆధిపత్యాన్ని మరింత అధికారికం, కేంద్రీకృతం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య సంస్థలు...

Gen Z Protests : జెన్ జీ ఆందోళన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి?

Gen Z Protests : దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటంటే.. యువత ముందుకు వస్తే మార్పు సాధ్యమవుతుంది. అయితే అదే యువత ఆవేశానికి,...

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...
Oktelugu Epaper
Exit mobile version