AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు అందించింది భారత వాతావరణ శాఖ. జూలై మొదటి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావం ఏపీతోపాటు ఒడిస్సా పై అధికంగా ఉంటుందని తెలిపింది. రానున్న రోజుల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల మందగమనం కనిపిస్తోంది. వాటి రాక ఆలస్యం కావడంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. దేశభ్యాప్తంగా 12 రాష్ట్రాలపై ఎప్పటికీ దీని ప్రభావం పడింది. 315 జిల్లాల్లో సగటు కంటే 40 మూడు శాతం లోటు వర్షం కురిసింది. జూలై రెండవ తేదీ నాటికి పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలియడం ఉపశమనం కలిగించే విషయం.
ఉపరితల ఆవర్తనం..
బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో జూలై రెండు నాటికి ఉపరితల ఆవర్తనం బలపడనుంది. అది మూడు, నాలుగు తేదీ నాటికి మరింత బలపడి బంగాళాఖాతంలో.. ఉత్తర ప్రాంతం వైపు కదులుతుంది. క్రమంగా అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం తీరప్రాంత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఏపీ తమిళనాడు తో పాటు తెలంగాణ పై అధిక ప్రభావం చూపి ఛాన్స్ ఉంది. నిజంగా ఇది శుభవార్త. జూన్లో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఆలస్యంగా విస్తరించిన రుతుపవనాలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడతాయని తెలుస్తుండడం ఆనందాన్ని ఇచ్చే విషయం. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం తో పాటు ఉత్తర కోస్తా తీర జిల్లాల్లో వర్షాలు పడవచ్చని చెప్పింది వాతావరణ శాఖ. ఉభయగోదావరి తో పాటు కోస్తాంధ్ర జిల్లాలకు సైతం వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.
ఇప్పటికీ వేడి వాతావరణం..
ఇంకా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వేసవి వాతావరణం కొనసాగుతోంది. ఖరీఫ్ పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతాయని చెబుతుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా బంగాళాఖాతంలో జూన్ నుంచి నవంబరు వరకు ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడవని అంతా భావిస్తున్న తరుణంలో.. కనీసం ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు పడితే గట్టెక్కవచ్చు అనే ఆలోచనలో రైతాంగం ఉంది. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇవ్వడం పై ఆశలు చిగురిస్తున్నాయి.
