DSC 2025 Andhra Pradesh: డీఎస్సీ 2025 విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాక్ తప్పులేదు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియలు అనేక రకాల అవకతవకలు జరిగాయని గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అయితే తన పక్కన డీఎస్సీ అభ్యర్థులను పెట్టుకుని మరి ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే ఈ విషయంలో అనుకున్న స్థాయిలో వైసీపీకి ప్రజల్లో మైలేజ్ దక్కలేదు. అలా దక్కలేదు సరి కదా తిరిగి డ్యామేజ్ జరిగింది. దానికి కారణం లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు మాదిరిగా కూటమి నుంచి ఎదురుదాడి రాలేదు. ఒక పద్ధతి ప్రకారం అధికారులు మీడియా ముందుకు వచ్చి సుదీర్ఘ వివరణలు ఇచ్చారు. ప్రతి అంశంపై స్పష్టత ఇచ్చారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు తేలిపోయాయి. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం గా ప్రజలు ఒక అంచనాకు వచ్చారు. అందుకే లైట్ తీసుకుంటున్నారు. మరికొందరైతే అసహ్యించుకుంటున్నారు వైసీపీ తీరుపై.
ఎప్పటికప్పుడు స్టాండ్ మార్చుతూ..
డీఎస్సీ విషయంలో వైసిపి ఒక స్టాండ్ తో ముందుకు వెళ్లలేదు. రకరకాల ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసింది. వైసీపీ నుంచి వచ్చిన ఆరోపణలకు కూటమి నేతలు కౌంటర్ ఇచ్చి ఉంటే అది రాజకీయ రగడగా మారి ఉండేది. అందుకే ప్రభుత్వం వ్యూహాత్మకంగా విద్యాశాఖ ఉన్నతాధికారులను రంగంలోకి దించింది. సాక్షి మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాలను కేస్ స్టడీస్ గా తీసుకుంటూ ఒక్కో అనుమానాన్ని నివృత్తి చేశారు. ఎంతో ఓపికగా అధికారులు సమాధానాలు చెప్పారు. దీంతో ఆదిలోనే దానికి కౌంటర్ ఇవ్వగలిగారు అధికారులు. సోషల్ మీడియాలో అధికారులు ఇచ్చే కౌంటర్ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు తేలిపోయాయి.
లోకేష్ సవాల్ తో..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఆధారాలు ఉంటే కచ్చితంగా న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు అని ప్రభుత్వ వర్గాలు సలహా ఇచ్చాయి. అది కూడా ప్రజల్లోకి వెళ్ళింది. వైసీపీ నేతలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు అంటూ ప్రజలు ఒక నిర్ధారణకు కూడా వచ్చారు. అక్కడితో ఆగలేదు. మళ్లీ కమ్మ డీఎస్సీ అంటూ చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాలో కమ్మ సామాజిక వర్గం వారికి అధిక అవకాశాలు కల్పించారు అంటూ ఆరోపణలు చేశారు. దానిని కూడా నివృత్తి చేసింది విద్యాశాఖ. రెడ్డి సామాజిక వర్గానికి 10 పోస్టులు, కాపు సామాజిక వర్గానికి 16 పోస్టులు ఇస్తే కమ్మ సామాజిక వర్గానికి మాత్రం 9 పోస్టులు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. ఆ విషయంలో కూడా ఆ పార్టీకి షాక్ తప్పలేదు. చివరిగా లోకేష్ సాహసించి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు చర్యలను తప్పుపడుతూ.. అవసరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి తనతో చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. దానికి సై అనలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. లక్ష్మీపార్వతి తో పాటు యాంకర్ శ్యామల లాంటి వారిని పంపించారు. మరోసారి డీఎస్సీ విషయంలో చతికిల పడ్డారు. ఈ మొత్తం పరిణామాలతో ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారు. డీఎస్సీ విషయంలో వైసిపి కుట్ర చేస్తుంది అనే అనుమానాలను ఎక్కువమంది నమ్మారు. అంతిమంగా ఇప్పుడు ఈ డీఎస్సీ అంశం అనేది వైసీపీకి ఎక్కువగా డ్యామేజ్ చేస్తోంది. మున్ముందు వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
