AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) వయసుకు మించి కష్టపడుతున్నారు. ఒకవైపు రాష్ట్ర పాలన చూస్తూనే మరోవైపు జాతీయ స్థాయిలో సైతం నిత్య పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో వరుసగా భేటీలు జరుపుతున్నారు. నిత్య సమీక్షలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్ డి ఏ సమావేశాలకు హాజరవుతున్నారు. బిజెపితో పాటు ఎన్డీఏ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వాలు కొలువు తీరుతున్న సమయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గత వారం రోజులుగా సీఎం చంద్రబాబు షెడ్యూల్ ను పరిశీలిస్తే.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పరిస్థితి. ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతున్న తీరు మాత్రం ఆకట్టుకుంటుంది.
* కోల్కత్తాలో ప్రత్యేక ఆకర్షణగా..
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 15 సంవత్సరాల మమతా పాలనను తెరదించుతూ కాషాయ జండా ఎగురవేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందూ అధికారి ప్రమాణం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు కు ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో కార్యక్రమానికి హాజరైన చంద్రబాబుకు కేంద్ర పెద్దలు గౌరవభావంతో చూశారు. చాలా ప్రాధాన్యం ఇచ్చారు. బిజెపిలో కొనసాగుతున్న బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.
* ఢిల్లీ బాట..
పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు చంద్రబాబు. అదే సమయంలో హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ గంటపాటు గడిపారు మోడీ. అయితే ఆ పర్యటన ముగిసిన వెంటనే ఢిల్లీ బాట పట్టారు చంద్రబాబు. నిన్న రోజంతా కేంద్ర మంత్రులను కలిసి ఏపీలో కీలక ప్రాజెక్టుల కు సంబంధించిన అంశాలను చర్చించారు. సాయంత్రం ఉన్నత స్థాయి సదస్సులో సైతం పాల్గొన్నారు. ఢిల్లీలోనే రాత్రి బస చేశారు. ఈరోజు అస్సాం లో సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు సీఎం చంద్రబాబు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పాలనలో క్షణం తీరిక లేకుండా ఉంటూనే.. జాతీయస్థాయిలో సైతం అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. నిజంగా చంద్రబాబు ఓపికకు హాట్సాఫ్ చెప్పాల్సిందే.