spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు వారికే..ఫిక్స్ చేసిన చంద్రబాబు!

CM Chandrababu: డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు వారికే..ఫిక్స్ చేసిన చంద్రబాబు!

CM Chandrababu: ఏపీలో శాసనసభ, శాసనమండలిలో పదవులకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఉభయ సభల్లో చీఫ్ విప్ ల పేర్లను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. శాసనమండలిలో వైసీపీకి బలం ఉంది. అక్కడ సమన్వయం కోసం విప్ ల నియామకం చేపట్టే అవకాశం ఉంది. ముందుగా అక్కడ పదవులు భక్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. దాదాపు ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే తప్ప అవే పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, కూన రవికుమార్, బెందాలం అశోక్ పేర్లు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ధూళిపాళ్ల నరేంద్ర పేరు బయటకు వచ్చినా.. గుంటూరు జిల్లాకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. మరొకరు కేంద్ర మంత్రిగా ఉండడంతో సామాజిక సమీకరణల దృష్ట్యా నరేంద్ర పేరు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శాసనసభలో విప్ లుగా జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ పేర్లను ఆ పార్టీ అధిష్టానం ప్రతిపాదించింది. జనసేన నుంచి మూడో విప్ గా పోలిశెట్టి శ్రీనివాస్ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

* శాసనమండలిలో
శాసనమండలిలో చీఫ్ విప్ లుగా టిడిపి ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల్లో ఒకరు చీఫ్ విప్ అయితే.. మరొకరిని విప్ గా నియమిస్తారని సమాచారం. మరో ఇద్దరు సభ్యులకు సైతం విప్ గా అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అందులోజనసేన నుంచి ఒకరికి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది.ప్రధానంగా హరిప్రసాద్ పేరు వినిపిస్తోంది.

* ఈనెల 22 వరకు సమావేశాలు
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్ననే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈనెల 22 వరకు సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలను సైతం తీసుకున్నారు. మరోవైపు శాసనమండలి బిఎసి సమావేశం కూడా జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ అశోక్ బాబు.. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ, రవిబాబు, పిడిఎఫ్ పక్ష నేత లక్ష్మణరావు హాజరయ్యారు. పలు అంశాలను చర్చించేందుకు చైర్మన్ ఓకే చెప్పారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper