spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: కాంగ్రెస్ తో చంద్రబాబుకు కొత్త భయం

Chandrababu: కాంగ్రెస్ తో చంద్రబాబుకు కొత్త భయం

Chandrababu: ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎంట్రీని అంతా లైట్ తీసుకున్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా భావించారు. అది ఇప్పుడప్పుడే పైకి లేవదని కూడా తేల్చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాకపోవచ్చు కానీ.. ఉనికి చాటుకునే అవకాశం ఉంది. ఇతర పార్టీల గెలుపోటములను నిర్దేశించే స్థాయికి చేరుకునే ఛాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో ఎవరికి నష్టం అంటే ముందుగా గుర్తొచ్చేది వైసిపి. కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి.. వైసీపీలో ఉన్నది మెజారిటీ కాంగ్రెస్ క్యాడర్ కాబట్టి.. కచ్చితంగా వైసీపీకి నష్టం కలుగుతుందని అంతా అంచనా వేశారు. పైగా వైఎస్ షర్మిల వైసిపి తో పాటు సోదరుడు జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వైసీపీకే నష్టమని భావించారు. కానీ ప్రధాని మోదీ హెచ్చరించేసరికి చంద్రబాబు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం ప్రారంభించారు.

వాస్తవానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చంద్రబాబు వ్యూహం కారణమని ప్రచారం జరిగింది. తెలంగాణ ఎన్నికల్లో ఫెయిల్ అయిన తర్వాత ఆమె.. ఏపీ వైపు చూశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ పగ్గాలు అందుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక చంద్రబాబు ఉన్నారన్నది వైసిపి ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే షర్మిల కేవలం వైసీపీని టార్గెట్ చేశారు. సోదరుడు జగన్ పై గురి పెట్టారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి తరచూ ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో వివిధ పార్టీల సీట్లు దక్కని వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు. అన్నింటికీ మించి తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేసరికి.. ఏపీలో కాంగ్రెస్ అభిమానులు యాక్టివ్ కావడం ప్రారంభించారు. దీంతో గత రెండు ఎన్నికల కంటే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికి పెరిగే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. ఇప్పటికే వైసీపీ, ఎన్డీఏ మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. ఆ రెండు పార్టీల స్థాయిలో బలం చూపకున్నా.. త్రిముఖ పోరులో ఇండియా కూటమి నిలిచే అవకాశం ఉంది. పైగా షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలో దించుతోంది. డాక్టర్ కిల్లి కృపారాణి, సాకే శైలజానాథ్, పల్లం రాజు, జెడి శీలం వంటి సీనియర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తున్నారు. కొంతమంది వ్యక్తిగత ప్రభావం కూడా చూపగలరు. అయితే ఇప్పటివరకు షర్మిల రాకను ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని భయం వెంటాడుతోంది. అందుకే చంద్రబాబు సైతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి టర్న్ అయిన క్యాడర్లో చీలికతో పాటు వైయస్ కుటుంబ అభిమానుల్లో చీలిక తెస్తే.. అది కూటమికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ తో వైసీపీకే కాదు కూటమికి సైతం ప్రమాదం పొంచి ఉందన్నమాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version