Homeఆంధ్రప్రదేశ్‌Amaravati: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్..

Amaravati: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్..

Amaravati: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి కి సంబంధించి కీలక నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. ప్రత్యేక రైల్వే లైన్ కు సంబంధించి భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పావులు కదిపింది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలిగించింది. కొత్త రైల్వే లైన్లకు సంబంధించి క్లియరెన్స్ లు ఇస్తోంది. గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలి, భూ సేకరణ వ్యయం భరించాలని చెప్పిన రైల్వే శాఖ.. ఇప్పుడు పూర్తిగా తమ నిధులతోనే ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ముందుకు రావడం విశేషం.

విజయవాడ, గుంటూరు రైల్వే లైన్లతో ఏపీ రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం ప్రతిపాదించిన ఈ కొత్త రైల్వే లైన్ 2017 -18 లోనే మంజూరు అయ్యింది. ప్రధానంగా ఎర్రుపాలెం-అమరావతి- నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర డబ్బులు లైన్, అమరావతి- పెదకూరపాడు మధ్య 24 కిలోమీటర్ల సింగల్ లైన్ కు కసరత్తు చేస్తున్నారు. అలాగే సత్తెనపల్లి- నరసరావుపేట మధ్య 25 కిలోమీటర్ల సింగిల్ లైన్ కలిపి.. మొత్తం 106 కిలోమీటర్ల మేర కొత్త లైన్ కు ఆమోదం తెలిపారు.. కానీ గత ఐదేళ్ల వైసిపి హయాంలో ఎటువంటి ముందడుగు పడలేదు.ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో రైల్వే శాఖ చాలా వేగంగా స్పందిస్తోంది. వీలైనంత త్వరగా అమరావతికి సంబంధించి రైల్వే ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించాలని భావిస్తోంది.

ప్రధానంగా ఎర్రుపాలెం- అమరావతి- నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మించాలని భావించారు. దాని బదులు ఇప్పుడు మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్ధమవుతోంది రైల్వే శాఖ. ఈ లైన్ కు గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయబోతున్నారు. ఈ సింగిల్ లైన్ నిర్మాణంతో పాటు భూసేకరణకు రూ.2500 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది రైల్వే శాఖ. ఈ కొత్త రైల్వే లైన్ విజయవాడ హైదరాబాద్ లైన్ లో ఎర్రుపాలెం దగ్గర మొదలై.. అమరావతి మీదుగా గుంటూరు- విజయవాడ లైన్ లోని నంబూరు దగ్గర కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత తొమ్మిది కొత్త స్టేషన్లను నిర్మాణాలు చేయనున్నారు. పెద్దాపురం, చిన్న రావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పు రావూరులలో ఈ స్టేషన్లో నిర్మిస్తారు. వీటిలో అమరావతిని ప్రధాన స్టేషన్ గా పరిగణిస్తున్నారు. మొత్తానికైతే అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కావడం, ఇప్పుడు కొత్త రైల్వే లైన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమరావతి ప్రాంతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version