Homeఆంధ్రప్రదేశ్‌Machilipatnam Ration Rice Case : పొగడ్తలకు లొంగని చంద్రబాబు.. మచిలీపట్నం బియ్యం కేసులో ట్విస్ట్!

Machilipatnam Ration Rice Case : పొగడ్తలకు లొంగని చంద్రబాబు.. మచిలీపట్నం బియ్యం కేసులో ట్విస్ట్!

Machilipatnam Ration Rice Case :  మాజీ మంత్రి పేర్ని నానికి షాక్ తగిలింది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో ఆయన భార్య పేరు తెరపైకి వచ్చింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన కృష్ణాజిల్లా కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇంతలో పోలీసులు పేర్ని నానిని ఇదే కేసులో ఏ6గా చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ, గోదాము మేనేజర్ పైనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో వీరిద్దరిని అరెస్టు చేస్తారని కూడా ప్రచారం నడిచింది. పేర్ని నాని అయితే కుటుంబంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే తన భార్య అరెస్టు కోసం మంత్రి కొల్లు రవీంద్ర ఒత్తిడి పెంచారని.. కానీ చంద్రబాబు ఒప్పుకోలేదని.. ఆయన హుందాతనానికి అభినందించాల్సిందేనట్టు వ్యాఖ్యానించారు నాని. అయినా సరే పేర్ని నానికి రేషన్ బియ్యం కేసులో ఊరట దక్కకపోవడం విశేషం.

* చంద్రబాబుకు పొగడ్తలతో ముంచేత్తిన
వైసిపి హయాంలో పేర్ని నాని మంత్రిగా ఉండేవారు. ఆ సమయంలో ఆయన భార్య పేరిట ఉన్న గోదాముల్లో రేషన్ బియ్యం నిల్వ చేసేవారు. అయితే అందులో 7000 కు పైగా బియ్యం బస్తాలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పౌర సరఫరాల శాఖతో పాటు పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ తరుణంలో పేర్ని నాని సతీమణి జయసుధను అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ కుటుంబంతో కలిసి పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు కూడా టాక్ నడిచింది. అయితే ఉన్నట్టుండి పేర్ని నాని ప్రత్యక్షమయ్యారు. మీడియా ముందుకు వచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గోదాముల్లో మాయమైన బియ్యానికి పరిహారం డిడి ల రూపంలో చెల్లించామని.. పోలీస్ విచారణ కంటే ముందు తమను దోషులుగా చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యను ఇరికించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. కేవలం చంద్రబాబు హుందాతనంతోనే తన భార్య అరెస్టులు జరగని విషయాన్ని ప్రస్తావించారు.

చంద్రబాబుపై పొగడ్తలతో పేర్ని కుటుంబానికి ఈ కేసులో ఊరట దక్కుతుందని అంతా భావించారు. కానీ ఏకంగా ఈ కేసులో ఏ 6 గా చేరుస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న కృష్ణ జిల్లా కోర్టు జయసుధకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీంతో ఇకనుంచి వారికి ఇబ్బంది ఉండదు అని అంతా భావించారు. కానీ ఏకంగా పేర్ని నాని పైనే కేసు నమోదు కావడం విశేషం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గోడౌన్ మేనేజర్, రైస్ మిల్ యజమాని, లారీ డ్రైవర్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఇప్పుడు అదే కేసు భార్యతో పాటు పేర్ని నాని మెడకు చుట్టుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version