spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Arnab Goswami: మీరు హిందువులేనా.. ఇంతకంటే ఘోరం ఉంటుందా?

Arnab Goswami: మీరు హిందువులేనా.. ఇంతకంటే ఘోరం ఉంటుందా?

Arnab Goswami: మతపరమైన రాజకీయాలు చేయడం చాలా తప్పు. కానీ ఒక మత విశ్వాసాలపై, భక్తుల నమ్మకం పై ప్రమాదకరమైన కుట్ర జరుగుతున్నప్పుడు మాత్రం స్పందించాలి. అయితే తాజాగా కల్తీ నెయ్యిని వాడించి తిరుమల( Tirumala) ప్రతిష్టని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న వారి విషయంలో మాత్రం హిందూ మఠాధిపతులు, స్వామీజీలు, హిందూ ధార్మిక సంస్థలు, హిందూమతం గొప్పదనాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రవచన కర్తలు నోరు మెదపకపోవడం ఒక విధంగా హిందూ మతానికి అన్యాయం చేసిన వారే. చివరకు విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ సైతం ఆశించిన స్థాయిలో దీనిని ఎదుర్కొనే ప్రయత్నం చేయడం లేదు. ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని నేషనల్ మీడియా ఛానల్ రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

* ఆర్నాబ్ ప్రశ్నల వర్షం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో నెయ్యి కల్తీ జరిగింది అనేది వాస్తవం. దానిని ధ్రువీకరిస్తూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. తిరుమల చరిత్రను మసకబార్చే విధంగా వ్యవహరించిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొందరు హిందూ మేధావులు సమర్థిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. సున్నితమైన ఈ అంశంపై రిపబ్లిక్ టీవీ చర్చ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న హిందూ మేధావుల తీరును ఆర్నాబ్ గోస్వామి తప్పు పట్టారు. కొన్ని రకాల ప్రశ్నలు అడిగారు. కోట్లాదిమంది భక్తులు పరమ పవిత్రంగా భావించే స్వామివారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేయడానికి జగన్ ఎలా సమర్థించుకుంటారు? రకరకాల రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని తిరుమల ప్రసాదంలో వాడటం నిజం కాదా? నిజమైతే అది తప్పని ఒప్పుకోకుండా ఎందుకు వితండ వాదనలు చేస్తున్నారు? క్రిస్టియన్ మతానికి చెందిన జగన్ అతని అనుచరులు హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమలలో ఎందుకు ఆటలాడుతున్నారు? అదే ఎవరైనా తన మత విషయాల్లో జోక్యం చేసుకుంటే సహిస్తారా? సమర్థిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఆర్నాబ్.

* జాతీయస్థాయిలో చర్చ..
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా లడ్డు తయారీకి సంబంధించిన నెయ్యిలో కల్తీ జరిగింది. అసలు పాలతో తయారుచేసిన నెయ్యి కాదు అని తేలిపోయింది. తిరుమల పవిత్రతను ఇంతగా దెబ్బతీసిన జగన్ అండ్ శిబిరం కలిసికట్టుగా కూటమి ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తుంటే.. హిందూ మత రక్షక బాధ్యతలు తమవి అన్నట్టు చెప్పుకుని తిరిగే బిజెపి పెద్దలు, బజరంగ్ దళ్ వంటి సంస్థలు నోరు విప్పడం లేదు. దీనిపైనే ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా నోరు తెరవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
Oktelugu Epaper
Exit mobile version