spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jana Sena: జనసేన ఆవిర్భావ సభతో ఏపీ పాలిటిక్స్ షేక్.

Jana Sena: జనసేన ఆవిర్భావ సభతో ఏపీ పాలిటిక్స్ షేక్.

Jana Sena: అనుకున్నదే నిజమవుతోంది. ఒక సభతో ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. జనసేన ఎక్కడుందని ప్రశ్నించే వారి మదిలో గుబులు రేగుతోంది. జనసేన ఒక పార్టీయేనని గుర్తించడం ప్రారంభిస్తున్నారు. ఇది మరింత ముదిరితే మాత్రం ఏపీలో సమూలంగా రాజకీయాలు మారిపోతాయి. అటు అధికార పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం అన్నింటిలోనూ కదలిక మొదలైంది. పవన్ తమను నష్టం చేస్తాడని అధికార పక్షం, కలుపుకొని వెళ్లకపోతే తమకు మరోసారి భంగపాటు తప్పదని ప్రధాన ప్రతిపక్షం భావిస్తోంది. దీంతో రెండు పార్టీలకు తన పదో ఆవిర్భావ సభ ద్వారా చుక్కులు చూపించగలిగారు పవన్ కళ్యాణ్.

అదే సమయంలో బీజేపీకి సైతం స్పష్టమైన సంకేతాలు పంపారు. తాను హైకమాండ్ పెద్దలకు దూరం కాలేదని.. రాష్ట్ర నాయకులే కారణమని చెప్పుకొచ్చారు. వారి వైఖరి వల్లే బలపడలేకపోయామని.. టీడీపీ అవసరం లేకుండా చేసుకోలేకపోయామని ఢిల్లీ పెద్దలకు అర్ధమయ్యే రీతిలో చెప్పారు. తమ రూట్లోకి వస్తే సరి.. లేకుంటే మాత్రం ఉనికి కూడా దక్కదని హెచ్చరికలు పంపారు. ముస్లింలపై దాడులు కొనసాగిస్తే బీజేపీని వదులుకోవడానికి కూడా వెనుకాడబోనని బంతిని ఢిల్లీ పెద్దల కోర్టులోకి పంపగలిగారు.

మరోవైపు తెలుగు దేశం పార్టీకి కూడా అవే సంకేతాలు ఇవ్వగలిగారు. తాను గెలుస్తానని భావించిన చోటే పోటీచేస్తానని కూడా చెప్పుకొచ్చారు. పార్టీకి, ఎమ్మెల్యేలకు గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని చెప్పడం ద్వారా ఇక నుంచి తనకు పార్టీయే అల్టిమేట్ అని గట్టి హెచ్చరికలే పంపారు. ఎక్కడ సంఖ్య బయటపెట్టకుండా బలం అన్న పదాన్ని మాత్రమే వాడారు. తన అవసరం ఎక్కువగా టీడీపీకి ఉందని తన సభతో ఘాటుగా చెప్పారు. అదే సమయంలో బీజేపీని హెచ్చరించే సమయంలో టీడీపీ అవసరం లేనంతగా ఎదగలేకపోయామని చెప్పడం ద్వారా పొత్తులకు స్పష్టమైన సంకేతాలు పంపారు.

ఇప్పటికే లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. జన సమీకరణతో పర్వాలేదనిపిస్తోంది. అయితే పవన్ సభతో మాత్రం పోల్చుకుంటే వెలవెలబోతోంది. కానీ సుదీర్ఘ పాదయాత్ర కావడంతో అదే మాదిరిగా కొనసాగుతుందని… ప్రతీరోజూ జన సమీకరణ చేయడం కుదరదని విశ్లేషకులు చెబుతున్నాయి. అయితే నాలుగు దశాబ్దాల పార్టీ ఎటువంటి కార్యక్రమం చేపట్టినా జన సమీకరణ చేయాల్సి వస్తోంది. కానీ దశాబ్దం నిండిన పార్టీ, ఇపై పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న పార్టీ లో కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు రావడం చర్చనీయాంశమవుతోంది.అందుకే ఇప్పుడు జనసేన అవసరం టీడీపీకే ఎక్కువ ఉందన్న వాదన వినిపిస్తోంది. జనసేన పదో ఆవిర్భావ సభ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంచలనాలకు వేదికగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper