spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Aghori Mata: ఇదేం మీడియా.. వార్తల్లేవా? ప్రజా సమస్యలు లేవా? ఇంతలా అఘోరించాల్సిన అవసరం ఏమొచ్చింది?

Aghori Mata: ఇదేం మీడియా.. వార్తల్లేవా? ప్రజా సమస్యలు లేవా? ఇంతలా అఘోరించాల్సిన అవసరం ఏమొచ్చింది?

Aghori Mata: ఇటీవల కాలంలో హైదరాబాదులో ఓ అఘోరి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మీడియా మొత్తం అఘోరీ వెంట పరుగులు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఆ అఘోరి తో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాయి. “మీరు ఎలా ఉంటారు,? ఎక్కడ ఉంటారు? ఒంటికి బూడిద ఎందుకు పూసుకుంటారు? మెడపై ఆ కపలాలు ఎందుకు? నెత్తి ని అలా ఉంగరాలుగా ఎందుకు చుట్టుకుంటారు?” అనే తీరుగా ప్రశ్నలు అందించారు. వాస్తవానికి ఇవేవీ జనానికి అవసరం లేదు. ఎందుకంటే హిమాలయాల్లో ఉండే అఘోరీ లు బయటికి రారు. వారు మొత్తం తపస్సులో ఉంటారు. శివుడిని ధ్యానిస్తూ ఉంటారు. అతని నామస్మరణ కొనసాగిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో శ్వాస బంధనం అనే ప్రక్రియను కూడా అవలంబిస్తారు. అయితే వీటి గురించి కనీస అవగాహన లేకుండా.. అఘోరి వచ్చిందని తెలియగానే మీడియా అఘోరి వెంటపడింది. ఇష్టానుసారంగా పరుగులు పెట్టింది. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత నాలుక కరుచుకుంది.

ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే తీరు

తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లోనూ అఘోరీ తీరు ఇలాగే కొనసాగింది. అఘోరి పేరుతో ట్రాన్స్ జెండర్ తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లోనూ సందడి చేసింది. ఒంటికి బూడిద పూసుకొని తిరుగుతోంది. మీడియా తన వెంట తిరుగుతుందని భావించి.. ఎలా వాడుకోవాలో అలా వాడుకుంది. చివరికి మీడియా ప్రతినిధుల పైన అఘోరి దాడులు చేసింది. ఇంత దారుణానికి పాల్పడినా మీడియా ఆ అఘోరి వెంటే తిరుగుతోంది. పైగా ఆ అఘోరి కూడా చిత్రచిత్రమైన వ్యాఖ్యలు చేస్తోంది..”పవన్ కళ్యాణ్ రావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కష్టాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది కానీ.. దానికి చాలా చేయాల్సి ఉంది. శాంతి యాగాలు.. యజ్ఞాలు చేయాలి. ఇవన్నీ నేను చేస్తాను. నాకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కావాలి” ఇలా మీడియా ఎదుట ఆ అఘోరి వ్యాఖ్యలు చేస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనే విషయాల గురించి పట్టించుకోని మీడియా.. వాటిని ఇష్టానుసారంగా ప్రసారం చేస్తోంది. పోటాపోటీగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇలాంటి వాటి వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగముంటుంది? ఇవి ఏ మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాయి? అనే విషయాలను పక్కనపెట్టి కేవలం టిఆర్పి రేటింగ్స్ కోసం మాత్రమే మీడియా నేలబారుతనాన్ని ప్రదర్శిస్తున్నది. ఇప్పుడు మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ఆ అఘోరి ఇలాంటి వ్యాఖ్యల చేసింది. రేవంత్ రెడ్డికి కష్టాలు తప్పవని స్పష్టం చేసింది. వాస్తవానికి అఘోరి అంటే దేవాలయాలు తిరగాలి. భక్తులతో మంచి మాటలు చెప్పాలి. అవకాశం ఉంటే ప్రవచనాలను వివరించాలి. కానీ దానిని పక్కనపెట్టి పబ్లిసిటీ కోసం అఘోరి ప్రయత్నాలు చేయడం నిజంగా విడ్డూరం. ఆ అఘోరి వెనక మీడియా పడటం మరింత చెండాలం.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website

Most Popular

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
Oktelugu Epaper
Exit mobile version