Homeఆంధ్రప్రదేశ్‌TTD: థర్డ్ క్లాస్ నా కొడుకా.. తిరుమలేషుడి ముందు ఆ బూతు పర్వం ఏంది సారూ*

TTD: థర్డ్ క్లాస్ నా కొడుకా.. తిరుమలేషుడి ముందు ఆ బూతు పర్వం ఏంది సారూ*

TTD: టీటీడీలో( Tirumala Tirupati Devasthanam) ఉన్న వివాదాలు చాలావున్నట్టు.. కొత్త వివాదాలకు అవకాశం కల్పిస్తున్నారు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తానని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీటీడీని సంస్కరిస్తానని చైర్మన్ బిఆర్ నాయుడు కూడా చాలా సందర్భాల్లో ప్రకటించారు. కానీ ప్రక్షాళన, సంస్కరణల మాట పక్కన పెడితే.. టీటీడీ చరిత్ర మసకబారేలా అనేక పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళనలకు గురిచేస్తోంది. టీటీడీ లడ్డూ వివాదం పెను దుమారానికి దారితీసింది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. అటు తరువాత తొక్కిసలాట ఘటనలో ఓ ఆరుగురు మృతి చెందడం.. టీటీడీ చరిత్రలోనే అత్యంత విషాదం. ఈ ఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి.. ఇంకా తప్పిదాలకు పాల్పడుతూనే ఉన్నారు.

* బాధ్యతాయుతమైన పదవిలో ఉండి
తాజాగా ఓ టీటీడీ( TTD) ఉద్యోగిపై బాధ్యతాయుతమైన టీటీడీ బోర్డు సభ్యుడు తిట్ల దండకంతో మనస్థాపానికి గురి చేశాడు. భక్తుల సమక్షంలోనే బూతులతో రెచ్చిపోయాడు. తనను మహాద్వారం మార్గం నుంచి వెలుపలికి పంపలేదని అక్కసుతో టీటీడీ ఉద్యోగి బాలాజీని బెంగళూరుకు చెందిన టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ కుమార్( Naresh Kumar) నోటికొచ్చినట్టు మాట్లాడారు. చుట్టూ వందలాదిమంది భక్తుల సమక్షంలోనే చాలా రకాలుగా మాట్లాడి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు టీటీడీ బోర్డు సభ్యుడు తీరుపై తప్పు పడుతున్నారు.

* అడ్డగోలుగా మాట్లాడుతూ..
వాస్తవానికి ఇటీవల నిబంధనలు మార్చారు. బయోమెట్రిక్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే విషయంపై బాలాజీ సంబంధిత ట్రస్ట్ బోర్డు సభ్యుడిని కోరడంతో ఆయన తీవ్ర ఆవిగ్రహం వ్యక్తం చేశారు. ఎవడ్రా నువ్వు.. పోరా బయటికి… థర్డ్ క్లాస్ నా కొడకా.. ఫస్ట్ బయటకు పంపండి.. లేకుంటే ఇక్కడే కూర్చుంటా అని నరేష్ కుమార్ టిటిడి సిబ్బందిపై చిందులు వేశారు. తాను ఒక బాధ్యతాయుతమైన ట్రస్టు బోర్డు సభ్యుడు అన్న విషయం కూడా మరిచిపోయారు. చాలా చీప్ గా బిహేవ్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. టీటీడీ బోర్డు సభ్యుడు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

*టీటీడీ పాలకవర్గం తీరుపై విమర్శలు
అయితే టీటీడీలో( TTD ) ఇంత జరుగుతున్నా.. ఇప్పటివరకు చైర్మన్ కానీ.. ఈవో కానీ.. ఇంతవరకు స్పందించకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీటీడీలో ఇటువంటి ఘటనలు నియంత్రించడానికి ట్రస్ట్ బోర్డు ఉందని… కానీ ఇంతవరకు స్పందించకపోవడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా టీటీడీ పాలకవర్గం స్పందించాల్సిన అవసరం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version