China reaction to India growth: సరిహద్దుల్లో నిత్యం కవ్వింపులకు పాల్పడుతుంది. ఈశాన్య రాష్ట్రాలను తన దేశంలో ఉన్న భూభాగంగా పేర్కొంటూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు సైనికులతో కొట్లాటకు కూడా దిగుతూ ఉంటుంది. గాల్వాన్ లోయ ఘటన ఇందుకు బలమైన నిదర్శనం. గాల్వాన్ లోయ ఘటన జరిగిన తర్వాత చైనా భారత్ జోలికి రావడం లేదు. అలాగని సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడకుండా ఉండడం లేదు. ఇటీవల కాలంలో భారత్ వ్యూహాత్మక వాణిజ్య విషయంలో ప్రపంచ దేశాలతో వేగంగా అడుగులు వేస్తోంది. వ్యూహాత్మకమైన మైత్రిని పెంపొందించుకుంటున్నది. ఈ నేపథ్యంలో చిప్ ల తయారీ.. ముడి సరుకుల రవాణా వంటి వాటిల్లో భారత ప్రభుత్వం ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది. ఒక రకంగా చైనాకు ఇది పెద్ద దెబ్బ.
ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడానికి చైనా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. ఆదిలోనే దెబ్బకొట్టేందుకు భారత్ రష్యాతో జట్టు కట్టింది. రష్యా ఒకప్పుడు ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించింది. అమెరికా ఆధిపత్యాన్ని సాగకుండా అడ్డుపడింది. రష్యా విచ్చిన్నం తర్వాత అమెరికా దూకుడుకు అడ్డు లేకుండా పోయింది. ఇప్పుడు చైనా అమెరికా స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో రకరకాల ఆయుధాలు.. తయారీ సంస్థల బలోపేతం.. వంటి వాటిల్లో చైనా దూకుడుగా ఉంది. చైనా దూకుడు కళ్లెం వేయడానికి భారత్ రష్యా తో చేతులు కలిపింది.
భారత్ ఇటీవల బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసింది. వాటిని ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ మీద ప్రయోగించింది. దీంతో యావత్ ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది. ఎటువంటి ప్రాణనష్టం లేకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే నేలమట్టం చేయడానికి భారత్ వీటిని ఉపయోగించింది. అంతటి ఇజ్రాయిల్.. అమెరికా వద్ద ఉన్న మిస్సైల్స్ కూడా ఇలాంటి పనిచేయలేదు. అయితే ఇప్పుడు భారత్ బ్రహ్మోస్ విషయంలో సరికొత్తగా అడుగులు వేస్తోంది. ఈ మెసేజ్ విభాగంలో చిన్న.. హైపర్ సోనిక్ వెర్షన్లను భారత్ తయారు చేయబోతోంది. అత్యంత వేగంగా పనిచేసే మిస్సైల్స్ ను భారత్ రష్యా సహకారంతో తయారుచేయబోతోంది. ఈ ఆయుధాలను తయారు చేసిన తర్వాత వియత్నాం.. ఫిలిప్పీన్స్ కు సమకూర్చబోతోంది.
ప్రపంచంలో ఇప్పటికే బ్రహ్మోస్ అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ గా పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చైనా మీడియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడి పాలకులు కూడా భారత్ చేస్తున్న ప్రయోగాల పట్ల భయపడుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది భారత్.. చైనా దేశానికి పక్కలో బల్లెం లాగా మారిన ఫిలిప్పీన్స్.. వియత్నాం దేశాలకు భారత్ ఆయుధాలు సరఫరా చేస్తుంది. ఇప్పటికే టిబెట్ విషయంలో చైనా ఎంతటి దుర్మార్గాలకు పాల్పడిందో ప్రపంచం మొత్తం చూసింది.. తైవాన్ తో ఎలాంటి తగువులు పెట్టుకుంటుందో అందరూ చూస్తున్నారు. అంతటి అమెరికా కూడా ఏం చేయలేకపోతోంది. అమెరికా చేయని పని ఇండియా చేసి చూపిస్తోంది. ఇండియా బ్రహ్మోస్ మిస్సైల్స్ కనుక చైనా పక్క దేశాలకు విక్రయించడం మొదలుపెడితే.. డ్రాగన్ కు కంటిమీద కునుకుండదు.
