S Jaishankar Iran Talks Success India Relief: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాలుస్తోంది. దీంతో ఆర్మూజ్ జలసంధిని ఇరాన్ మరింత కట్టుదిట్టం చేసింది. ఒక్క నౌక కూడా దాటి వెళ్లకుండా చర్యలు చేపట్టింది. వాటర్ మైన్స్ ఏర్పాటు చేసింది. దీంతో ఆయిల్ సంక్షోభం మరింత తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. భారత్లో ఇప్పటికే ఎన్ఎల్జీ సమస్య మొదలైంది. గ్యాస్ ధరలను కేంద్రం పెంచింది. ఈ తరుణంలో నిల్వలు అడుగంటక ముందే భారత్కు రావాల్సిన షిప్పుల కోసం కేంద్రం చర్చలు మొదలు పెట్టింది. జైశంర్ చర్చలు ఫలించి హార్ముజ్ జలసంధి గుండా భారత ట్యాంకర్లకు ప్రత్యేక అనుమతి లభించడం దేశ ఆర్థిక భద్రతకు పెద్ద ఊరట.
Also Read: ఐపీఎల్ 16 రోజులేనా.. బీసీసీఐ ఇచ్చిన ట్విస్ట్ వెనుక అసలు కారణం ఇది
చారిత్రక మైత్రి ఫలితంగా..
అమెరికా, ఇజ్రాయిల్, యూరప్ నౌకలపై ఆంక్షలు ఉన్నప్పటికీ, భారత వాహనాలకు మార్గం తెరిచారు. ఐఆర్జీసీ మార్గదర్శకత్వంలో ఈ మినహాయింపు లభించింది. ఇరాన్తో చారిత్రక మైత్రీ ఫలితంగా భారత్కు ఈ మినహాయింపు దక్కింది. దీంతో సౌదీ, యూఏఈ, ఇరాక్, కువైట్ ఎగుమతులు ఇప్పుడు సజావుగా చేరుతాయి.
ఆర్థిక ప్రయోజనాలు
భారత్ 60% క్రూడ్ దిగుమతులు ఈ మార్గంపై ఆధారపడుతుంది. యుద్ధం కారణంగా మార్గం మూసివేతతో సరఫరా నిలిచిపోయింది. తాజా చర్చలతో రోజుకు 17–20 మిలియన్ బ్యారెళ్ల సరఫరా ప్రభావితం కాకుండా రక్షణ. లభించింది. రూ.10 వేల కోట్ల విలువైన వాణిజ్య నౌకలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఇరాన్తో ఉన్న బలమైన డిప్లొమటిక్ టైస్, రష్యా–చైనా మధ్య తటస్థత చూపి ప్రయోజనం పొందింది. చైనా నౌకలకు కూడా అనుమతి ఇచ్చిన సందర్భంలో భారతం ప్రత్యేక స్థానం.