spot_img
Homeఅంతర్జాతీయంPakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం లేదు. పాకిస్థాన్ దిగజారి పోవడం కొత్త కాకపోయినప్పటికీ. ఈ స్థాయిలో బిచ్చం ఎత్తుకొని స్థాయికి ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడం అక్కడి ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధాన్ని తగ్గించడానికి.. శాంతి వాతావరణం నెలకొల్పడానికి దాయాది దేశం మధ్యవర్తి పాత్ర పోషించింది. అయితే రెండుసార్లు చర్చలు జరిగినప్పటికీ.. శాంతి కాదు కదా.. కనీసం కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరగలేదు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పి.. అంతర్జాతీయంగా పోయిన పరువును కాపాడుకోవాలని పాకిస్థాన్ అనుకుంది. కానీ పాకిస్థాన్ అనుకున్నట్టుగా ఏదీ జరగలేదు. పైగా నాడు శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కట్టలేదని వార్తలు వచ్చాయి.

నాడు శాంతి చర్చలకు సంబంధించిన ఖర్చు మొత్తం ఆఘా ఖాన్ ఫౌండేషన్ భరిచ్చినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ కనీసం చర్చకు సంబంధించిన ఖర్చు కూడా పెట్టుకునే స్థితిలో లేకపోవడంతో.. ఆ ఫౌండేషన్ ముందుకు వచ్చినట్టు సమాచారం. పైగా ఇప్పుడు పాకిస్తాన్లో పైసా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం లేదు.. అక్కడ మిలిటరీకి మాత్రమే జీతాలు ఇస్తున్నారు. మిగతా విభాగాలలో కోతలు విధిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇప్పుడిక పాకిస్తాన్ నడిబజార్లలో బిచ్చగాళ్ళ మాదిరిగా యాచించడం మొదలుపెట్టింది.

ఇటీవల అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలకు తాము ప్రాతినిధ్యం వహించామని చెప్పుకుంటున్న పాకిస్తాన్.. ఇప్పుడు ఏకంగా అమెరికాను బిచ్చం ఎత్తుకుంటున్నది. అమెరికాను 10 బిలియన్ డాలర్ల బైలటేరియల్ ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫండ్ ఇవ్వాలని అడుగుతున్నది. ఇటీవల ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చలకు తాము సమన్వయం వహించామని.. అందువల్లే ఈ డబ్బులు కావాలని పాకిస్తాన్ అడుగుతున్నది. వాస్తవ పరిస్థితి ప్రకారం చూసుకుంటే ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ఇంతవరకు సఫలం కాలేదు. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు ఈ ఫండ్ ను అమెరికా ఎలా ఇస్తుందో పాకిస్తాన్ కే తెలియాలి. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం డబ్బుల కోసమే విదేశాలలో పర్యటిస్తోంది. ఇతర దేశాల నుంచి అప్పులు ఆశిస్తోంది. అందువల్లే ఆ దేశం దివాలా అంచులో మిగిలిపోయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
High Protein Breakfast

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....
Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
India vs Zimbabwe

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
Oktelugu Epaper