Pakistan Day Cancellation Reason 2026: సాధారణంగా ఏ దేశమైనా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్వసం, రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తాయి. ఉగ్రవాదుల ముప్పు ఉంటే బల్లెట్ ప్రూఫ్ వాడి అయినా వేడుకలు జరుపుతారు. జాతీయ పండుగలను రద్దు చేయరు. ఎంత ఇబ్బంది ఉన్నా జాతీయ వేడుకలు వద్దని చెప్పే దేశం ఉండదు. కానీ అలా ఆదేశించిన దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే పాకిస్తాన్ మార్చి 23న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుంది. ఇక లాహోర్పై భారత్ దాడిచేసిన దినోత్సవాన్ని పాకిస్తాన్ రక్షణ దినంగా జరుపుకుంటుంది. ఇక కశ్మీర్ సాలిడారిటీ డే ఒకటి నిర్వహిస్తుంది. మార్చి 23 పాకిస్తాన్కు అత్యంత ముఖ్యమైనది. పాకిస్తాన్ డే. పాకిస్తాన్ ప్రత్యేక దేశం కోసం మొదటిసారి లాహోర్లో రెజల్యూషన్ పాస్ చేసింది మార్చి 23, 1940లో, ఇక 1956లో మార్చి 23న రాజ్యాంగం స్థాపన దినంగా జరుపుకుంటారు. ఈసారి ఆ వేడుకలు నిర్వహించొద్దని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద పెద్ద ర్యాలీలు అవసరం లేదని, ప్రజలు జమ కూడొద్దని నిర్ణయించింది. కేవలం జెండా ఎగురవేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్గానిస్తాన్ దాడి భయం అసలు కారణంగా కనిపిస్తోంది.
Also Read: రాజశేఖర్ కొత్త బిజినెస్ ను ఓపెన్ చేయడానికి వెళ్తున్న చిరంజీవి… ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..?
చారిత్రక ప్రాముఖ్యత..
1940 మార్చి 23న లాహోర్ రిజల్యూషన్తో పాకిస్తాన్ ఆలోచన మొదలైంది. 1956లో రాజ్యాంగ అమలుతో గణతంత్ర దినంగా జరుపుకుంటారు. సాధారణంగా 31–గన్ సెల్యూట్, సైనిక ప్రదర్శనలు జరుగుతాయి. ఈసారి పూర్తి రద్దు అరుదైన చర్య. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. పొదుపు చర్యల్లో భాగంగా వర్క్ వీక్ తగ్గింపు, వేతన కోతలతోపాటు వేడుకలు ఆపేశారు. ఇది దేశ చరిత్రలో మొదటిసారి.
ఆఫ్గానిస్తాన్ భయం..
పాకిస్తాన్ ఆఫ్గానిస్తాన్పై డ్రోన్ దాడులు, ఆస్పత్రి దాడితో (400 మరణాలు) ఉద్రిక్తత పెరిగింది. ఆఫ్గాన్ ప్రతీకారంగా నూర్ఖాన్ ఎయిర్బేస్, సైనిక పోస్టులపై దాడి చేసి 8 మంది చంపింది. 4–5 పోస్టులు ఆక్రమించింది. ఈ భయంతో ఇస్లామాబాద్లో పెద్ద సమావేశాలు నివారించారు.
ఆర్థిక సంక్షోభం (చమురు రిజర్వులు తక్కువ) ప్రభుత్వానికి ఒత్తిడి మొదలైనా, ఆఫ్గాన్ సరిహద్దు ఉద్రిక్తత ప్రధానం. పెద్ద ర్యాలీలు లక్ష్యాలుగా మారే భయం రద్దుకు దారితీసింది. ఇది పాక్ సైనిక బలం, ఆర్థిక స్థిరత్వం బలహీనతలను తెలియజేస్తుంది.
