Homeఅంతర్జాతీయంPakistan Crisis: అంతే.. పాకిస్తాన్ లో పుట్టినందుకు అనుభవించండి

Pakistan Crisis: అంతే.. పాకిస్తాన్ లో పుట్టినందుకు అనుభవించండి

Pakistan Crisis: ఏ దేశ ప్రజల కైనా సరే తమ సొంత గడ్డ ఒక అస్తిత్వంగా నిలుస్తూ ఉంటుంది. దాని ఆధారంగానే వారికి ప్రపంచంలో గౌరవం లభిస్తుంది. ఆఫ్రికా నుంచి మొదలు పెడితే ఆసియా వరకు అన్ని దేశాల ప్రజలకు ఇదే వర్తిస్తుంది. కానీ ఒక పాకిస్తాన్ ప్రజలకు తప్ప.

వారు చేసుకున్న దురదృష్టమేంటో తెలియదు. వారు చేసిన పాపం ఏంటో కూడా తెలియదు. ఆ దేశంలో పుట్టడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వారి మీద ఎవరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉండదు. ఏ దేశం కూడా వారిని మనుషుల్లాగా చూడదు. వారు వచ్చారంటే చాలు చీడపురుగుల మాదిరిగా చూస్తూ ఉంటుంది. ఇలాంటి హేళనలు వాళ్ళు భరిస్తూనే ఉన్నారు. పంటికింద ఆ బాధను అదిమి పెడుతూనే ఉన్నారు. అయినప్పటికీ వారి దేశం మీద ఉన్న అపప్రద తొలగిపోవడం లేదు. పైగా ఉగ్రవాదులతో అంటకాగడం వల్ల ఆ దేశానికి అంతకుమించిన స్థాయిలో చెడ్డ పేరు వస్తోంది.

అక్కడి పాలకులు.. ఉగ్రవాద సంస్థల నిర్వాహకులు కలిసి పోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. చివరికి ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ అంటేనే ఛీ కొడుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ దేశ ప్రజలను యూఏఈ తరిమి తరిమి కొడుతోంది. ఇటీవల అమెరికాకు యూఏఈ సైనిక స్థావరాల ఏర్పాటు కోసం అవకాశం కల్పించింది.. దీనిని మనసులో పెట్టుకున్న ఇరాన్ యూఏఈ మీద దాడులు చేసింది. అయితే ఇరాన్ దేశానికి సమాచారం అందించింది తమ దేశంలో ఉన్న పాకిస్తాన్ షియాలు అని యూఏఈ అనుమానించింది. అంతేకాదు విచారణ కూడా మొదలుపెట్టింది. ఆ విచారణలో తాము అనుమానిస్తున్నది నిజమేనని తేలింది. దీంతో అప్పటినుంచి యూఏఈ ఆపరేషన్ మొదలుపెట్టింది. తమ దేశంలో ఉంటున్న పాకిస్తాన్ ముస్లింలను వెనక్కి పంపిస్తోంది. కనీసం వాళ్ళ ఆస్తులు.. సేవింగ్స్.. ఇంటి లగేజ్ కూడా ఇవ్వకుండా కట్టుబట్టలతో పాకిస్తాన్ పంపిస్తోంది.. షియా ముస్లింలుగా తాము పుట్టడమే నేరమా అంటూ అక్కడివారు విలపిస్తున్నారు. షియా ముస్లింలు ఇరాన్ దేశానికి భారీగా ఫండింగ్ చేస్తున్నారని.. తమ దేశంలో ఉంటూ.. ఇరాన్ దేశానికి సపోర్ట్ చేస్తున్నారని యూఏఈ ఆరోపిస్తోంది.

యూఏఈ ఇటీవల పాకిస్తాన్ దేశానికి ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో గల్ఫ్ దేశాల వద్ద బిచ్చమెత్తుకొని పాకిస్తాన్ ఆ అప్పు చెల్లించింది. ఆ అప్పు తీరిన తర్వాత యూఏఈ తమ దేశంలో స్థిరపడిన పాకిస్తాన్ దేశీయులను తరిమి తరిమికొడుతోంది. అంతేకాదు అవసరమైతే పాకిస్తాన్ దేశంతో యుద్ధం చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ రకరకాల విన్యాసాలు చేస్తోంది. గోడ మీది పిల్లి వాటం లాగా ప్రయత్నాలు చేస్తోంది. ఇది యూఏఈ కి కంటగింపుగా మారింది. అందువల్లే ఈ స్థాయిలో పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకుంటున్నది. తమ దేశస్తులను బయటికి వెళ్లగొడుతున్నప్పటికీ ఇంతవరకు పాకిస్తాన్ పరిపాలకులు మాట్లాడటం లేదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు ఇటీవల మనదేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ యూఏఈ లో పర్యటించారు. అనేక రకాల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.. ముఖ్యంగా చమురు రంగంలో భారీగా పెట్టుబడులను ఆహ్వానించారు. దానికి యూఏఈ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. ఇది ఒక రకంగా పాకిస్తాన్ దేశానికి చెంప పెట్టు లాంటిది. అంతర్జాతీయ అవసరాలు.. ఇంకా అనేక రకాల పరిణామాల నేపథ్యంలో భారత్ సరికొత్త వాణిజ్య సూత్రాలను అమలు చేస్తోంది. అందులో భాగమే యూఏఈ తో స్నేహం. స్థూలంగా చెప్పాలంటే శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్నట్టు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version