Homeక్రీడలుక్రికెట్‌GT Vs RCB Qualifier: క్వాలిఫైయర్ సమరం.. జిటి వర్సెస్ ఆర్సిబి.. గెలిచేది ఎవరంటే..

GT Vs RCB Qualifier: క్వాలిఫైయర్ సమరం.. జిటి వర్సెస్ ఆర్సిబి.. గెలిచేది ఎవరంటే..

GT Vs RCB Qualifier: ఐపీఎల్ లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు లీగ్ దశలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన జట్లు ప్లే ఆఫ్ దశకు వచ్చేసాయి. ప్లే ఆఫ్ దశలో తొలి సమరం మంగళవారం నుంచి మొదలు కాబోతోంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న బెంగళూరు, గుజరాత్ జట్లు తలబడబోతున్నాయి.

డిపెండింగ్ ఛాంపియన్గా బెంగళూరు కొనసాగుతుండగా.. సంచలనజట్టుగా గుజరాత్ రంగంలోకి దిగుతోంది. ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు జట్లలో సమఉజ్జీలైన ప్లేయర్లు ఉన్నారు.. గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్ 638, గిల్ 616 పరుగులు చేశారు. వీరిద్దరూ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. అంతేకాదు ఆరెంజ్ క్యాప్ విభాగంలో తొలి రెండు స్థానాలలో ఉన్నారు. బట్టల కూడా 469 పరుగులతో తిరుగులేని స్థాయిలో ఉన్నాడు. వీరు ముగ్గురు గనుక అదరగొడితే గుజరాత్ జట్టుకు అడ్డు అనేది ఉండదు. బౌలింగ్లో కూడా గుజరాత్ అత్యంత పటిష్టంగా ఉంది. 24 వికెట్లు పడగొట్టి రబాడ పర్పుల్ క్యాప్ విభాగంలో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. సిరాజ్ 17 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ 19 వికెట్లతో, ప్రసిద్ధి కృష్ణ 14 వికెట్లతో తిరుగులేని స్థాయిలో ఉన్నారు. లీగ్ దశలో చివరి మ్యాచ్లో చెన్నై జట్టును గుజరాత్ 89 పరుగులు తేడాతో ఓడించింది.

ఇక బెంగళూరు ఈ సీజన్లో 14 మ్యాచ్లలో 9 విజయాలు సాధించింది. ఈ సీజన్లో ఒక సందర్భంలో రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. మరోవైపు గుజరాత్ ఫస్ట్ హాఫ్ లో ఇబ్బంది పడినప్పటికీ.. సెకండ్ హాఫ్ లో సత్తా చూపించింది. తొలి ఏడు మ్యాచ్లలో నాలుగింట్లో ఓడిపోయింది. ఆ తర్వాత ఏడు మ్యాచ్లలో ఆరు గెలిచింది. పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలోకి వచ్చింది. విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, పాటిధార్, సాల్ట్, పడికల్, కృనాల్ పాండ్యా వంటి ప్లేయర్లతో బెంగళూరు భీకరంగా కనిపిస్తోంది.

ఈ రెండు జట్లు సమఉజ్జీలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఐపీఎల్లో 8 సార్లు తలపడ్డాయి. చెరి 4 సార్లు విజయం సాధించాయి. ఈ సీజన్లో రెండుసార్లు ఈ జట్లు పోటీపడ్డాయి. ఏప్రిల్ 24 న జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఏప్రిల్ 30న జిటి మూడు వికెట్ల తేడాతో బెంగళూరు మీద గెలిచింది.. మంగళవారం జరిగే పోరు రెండు జట్ల మధ్య హోరాహోరీగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు.. పైగా రెండు జట్లలో భీకరమైన ప్లేయర్లు ఉన్నారు.

మ్యాచ్ జరిగే ధర్మశాల పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ వేదిక మీద ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి. రెండు సందర్భాల్లో కూడా టార్గెట్ ఫినిష్ చేసిన జట్లు మాత్రమే విజయాలు సాధించాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version