Homeఅంతర్జాతీయంOldest Countries: అత్యంత పురాతన దేశాలు ఏవి.. వాటిలో భారత్ స్థానం ఎంత అంటే?

Oldest Countries: అత్యంత పురాతన దేశాలు ఏవి.. వాటిలో భారత్ స్థానం ఎంత అంటే?

Oldest Countries: ప్రపంచంలో అత్యంత పురాతనమైన దేశాలు ఎన్నో ఉన్నాయి. శతాబ్దాలుగా ఇవి తమ ఉనికిని చాటుకుంటూ వచ్చాయి. అందులో ఇండియా కూడా ఉండడం విశేషం. ప్రాచీన సాంప్రదాయాలు, సంస్కృతుల మేలవింపు భారతదేశము. అన్ని మతాల సమాహారం. ఎన్నెన్నో జాతులు, వర్గాలను ఇముడ్చుకున్న మహాసముద్రం మన దేశం.ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది దేశాలు అత్యంత పురాతనమైనవిగా నిలుస్తున్నాయి. అందులో భారతదేశంలో ఏ స్థానంలో నిలుస్తుందో ఒకసారి తెలుసుకుందాం.

ప్రపంచంలో అత్యంత పురాతనమైన దేశాల్లో ఇరాన్, ఈజిప్టు, సిరియా, వియత్నం, ఆర్మేనియా, కొరియా, చైనా, భారతదేశం నిలుస్తున్నాయి. ఇవన్నీ క్రీస్తు పూర్వం ఏర్పడడం విశేషం. ఇరాన్ అత్యంత పురాతన దేశం. క్రీస్తుపూర్వం 3200లో ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. ఇరాన్ ను 20వ శతాబ్దం మధ్యకాలం వరకు పర్షియా అని పిలిచేవారు. ఇరాన్ కు పురాతన ప్రధాన నాగరికతలలో గొప్ప చరిత్ర ఉంది. ప్రస్తుతం ఇరాన్ కు టెహ్రాన్ రాజధానిగా ఉంది. తరువాత పురాతన దేశాల్లో ఈజిప్టు ఉంది. క్రీస్తుపూర్వం 3100లో ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ అనేది అసలు పేరు. నార్మర్ మెనెస్ అనే రాజు ఈ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీని రాజధాని మొదట మేంఫిష్ కాగా.. ఇప్పుడు కైరోగా ఉంది.

సిరియా అత్యంత పురాతన దేశం. క్రీస్తుపూర్వం 3000 నాటి దేశమిది. పురావస్తు తవ్వకాల్లో ఎల్బా అనే నగరం బయటపడింది. ఇది క్రీస్తుపూర్వం 3000 నాటిదని అక్కడి ప్రజలు నమ్ముతారు. వియత్నం కూడా పురాతన దేశమే. క్రీస్తుపూర్వం 2,879లో ఏర్పడినట్లు చరిత్ర చెబుతోంది. మంచి సాంప్రదాయాలకు బీజం వేసింది ఈ దేశమే. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తారు ఇక్కడ. ప్రస్తుతం దీని రాజధాని హనోయి. అర్మేనియాది కూడా సుదీర్ఘ చరిత్ర. క్రీస్తుపూర్వం 2492లో ఏర్పడింది ఈ దేశం. క్రీస్తు శకం 301లో క్రైస్తవ మతాన్ని తమ రాష్ట్ర మతంగా స్వీకరించిన వారిలో అర్మేనీయులు మొదటి వారు. మతపరమైన వారసత్వం కొనసాగించడంలో ఈ దేశం ముందంజలో ఉంది. కొరియా క్రీస్తుపూర్వం 2333లో ఏర్పడినట్టు చరిత్ర చెబుతోంది. కాలానుగుణంగా కొరియా రాజధాని నగరాలు మారుతుంటాయి. వీటిలో జోల్బన్, గుంగ్నే, పొంగ్యాంగ్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ దేశం ఉత్తరకొరియా, దక్షిణ కొరియాలుగా ముక్కలు అయింది. ఇక్కడ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి.
చైనా కూడా పురాతనమైన దేశాల్లో ఒకటి. క్రీస్తుపూర్వం 2070లో ఏర్పడింది. అప్పట్లో రాజధానిగా జియాన్, ప్రస్తుతం బీజింగ్ గా మారింది. యూ ది గ్రేట్ స్థాపించినట్లుచరిత్ర చెబుతోంది.

ప్రపంచంలో అత్యంత పురాతన దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. క్రీస్తుపూర్వం 2000లో సింధులోయ నాగరికతతో భారతదేశం ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతుంటారు. భారతదేశ స్థాపనకు సింధులోయ నాగరికత లేదా రాజు చంద్రగుప్త మౌర్య కారణమని చెబుతుంటారు. మొదట పాటలీపుత్ర భారత రాజధానిగా కొనసాగింది. రెండు లక్షల 50 వేల సంవత్సరాల నాటి గొప్ప చరిత్రను భారతదేశము కలిగి ఉందని చరిత్రకారులు చెబుతుంటారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version