Homeఅంతర్జాతీయంIndia vs China tensions: చైనా భారత వ్యతిరేక వ్యూహం.. బెడిసి కొట్టిన కుట్ర?

India vs China tensions: చైనా భారత వ్యతిరేక వ్యూహం.. బెడిసి కొట్టిన కుట్ర?

India vs China tensions: దక్షిణాసియాలో భారత్, చైనా బలమైన దేశాలు. అయితే భారత్‌ ప్రాబల్యం తగ్గించి తానే నంబర్‌ వన్‌గా నిలవాలని చాలాకాలంగా ప్రయత్నిస్తోంది చైనా. ఈ క్రమంలో అనేక ప్రయత్నాలు చేస్తోంది. తాజగా మరో వ్యూహం రూపొందించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లతో కలిసి కొత్త త్రైపాక్షిక ఒప్పందాలను రూపొందిస్తోంది. 2025 మే 21న బీజింగ్‌లో జరిగిన చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ విదేశాంగ మంత్రుల సమావేశం ఈ వ్యూహంలో కీలక భాగం. ఈ సమావేశంలో చైనా–పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సీపీఈసీ)ని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడం, ఐక్యరాజ్యసమితి తాలిబాన్‌ ఆంక్షల కమిటీలో పాకిస్తాన్‌కు చైర్మన్‌ పదవి దక్కేలా చైనా చేసిన ప్రయత్నాలు భారత్‌పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఉన్నాయి. అయితే, పాకిస్తాన్‌–ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దులో ఇటీవలి ఉద్రిక్తతలు చైనా ప్రణాళికలకు సవాళ్లను తెచ్చిపెట్టాయి.

బీజింగ్‌లో త్రైపాక్షిక సమావేశం..
2025 మే 21న బీజింగ్‌లో జరిగిన చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ విదేశాంగ మంత్రుల సమావేశంలో చైనా–పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సీపీఈసీ)ని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడానికి ఒప్పందం కుదిరింది. ఈ సమావేశం భారత్‌ యొక్క ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జరిగిన తొలి ఉన్నత స్థాయి సమావేశం. ఇది పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ద్వారా సీపీఈసీ నిర్మాణాన్ని భారత్‌ ఖండించిన నేపథ్యంలో జరిగింది. చైనా ఈ సమావేశం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆర్థిక, రాజకీయ కక్ష్యలోకి తీసుకొచ్చే ప্রయత్నం చేస్తోంది, దీనివల్ల భారత్‌ ప్రాంతీయ ప్రభావాన్ని తగ్గించే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యూహం దక్షిణాసియాలో భారత్‌ను ఒంటరిగా నిలపడానికి, దాని పొరుగు దేశాలతో సంబంధాలను దెబ్బతీసేందుకు రూపొందినట్లు తెలుస్తోంది.

Also Read: ఎఫ్‌–35బి.. బ్రిటన్‌ రాయల్‌ నేవీ యుద్ధ విమానం.. స్టెల్త్ టెక్నాలజీ చోరీ కాకుండా ఎలా విప్పేస్తున్నారంటే?

పాకిస్తాన్‌కు కీలక పదవి..
చైనా, ఐక్యరాజ్యసమితిలో తాలిబాన్‌పై ఆంక్షల కమిటీ చైర్మన్‌ పదవి పాకిస్తాన్‌కు దక్కేలా చేసినట్లు సమాచారం. ఈ చర్య భారత్‌ యొక్క దౌత్యపరమైన చొరవలను అడ్డుకోవడానికి, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌తో భారత్‌ సంబంధాలను మెరుగుపరచుకునే ప్రయత్నాలను బలహీనపరచడానికి ఉద్దేశించినది. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్, తాలిబాన్‌ విదేశాంగ మంత్రి ముత్తాఖీతో జరిపిన ఫోన్‌ సంభాషణ భారత్‌–ఆఫ్ఘనిస్తాన్‌ సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్‌కు యూఎన్‌ కమిటీ చైర్మన్‌ పదవి దక్కడం ద్వారా, చైనా తాలిబాన్‌పై ఆంక్షలను నియంత్రించే అధికారాన్ని పాకిస్తాన్‌కు అప్పగించి, భారత్‌ను రాజకీయంగా ఒడ్డున పెట్టే ప్రయత్నం చేసింది.

తెహ్రీక్‌ – ఎ – తాలిబాన్‌ దాడి..
చైనా త్రైపాక్షిక వ్యూహం సీపీఈసీని ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించడంపై ఆధారపడినప్పటికీ, పాకిస్తాన్‌–ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దులో ఇటీవలి ఉద్రిక్తతలు ఈ ప్రణాళికలకు సవాళ్లను తెచ్చిపెట్టాయి. పాకిస్తాన్‌ సైనిక వాహనంపై తెహ్రీక్‌–ఎ–తాలిబాన్‌ (టీటీపీ) చేసిన బాంబు దాడిలో 26 మంది పాకిస్తాన్‌ సైనికులు మరణించారు, దీని తర్వాత పాకిస్తాన్‌ ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దును మూసివేసింది. ఈ ఘటన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య సంబంధాలను మరింత దిగజార్చింది. ఫలితంగా త్రైపాక్షిక సహకార ప్రణాళికలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వం టీటీపీని నియంత్రించడంలో విఫలమైందని ఆరోపిస్తోంది, ఇది చైనా ప్రాంతీయ స్థిరత్వ లక్ష్యాలకు అడ్డంకిగా నిలిచింది.

Also Read: రెండు వారాల్లో 900 భూకంపాలు.. జపాన్ లోనే అత్యధికంగా భూకంపాలు ఎందుకు వస్తాయి? ఏంటా కథ?

భారత్‌పై దాడి ఆరోపణలు..
సరిహద్దు దాడులకు భారత్‌నే బాధ్యత వహించేలా చైనా, పాకిస్తాన్‌ కలిసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. టీటీపీ దాడి తర్వాత, ఈ ఘటనలో భారత్‌ హస్తం ఉందని ఆరోపించడం ద్వారా, చైనా, పాకిస్తాన్‌ భారత్‌ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ అసత్య ప్రచారం భారత్‌–ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య మెరుగవుతున్న సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతో ఉంది. ముఖ్యంగా భారత్‌ తాలిబాన్‌తో దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేస్తున్న సమయంలో. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్‌ ప్రభుత్వం పహల్గాం దాడిని ఖండించడం, భారత్‌తో సహకారాన్ని కొనసాగించాలనే ఆసక్తిని చూపడం చైనా–పాకిస్తాన్‌ వ్యూహానికి ఎదురుదెబ్బగా నిలిచింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular