Homeఅంతర్జాతీయంpakistan migrants : పాకిస్తానీల కండకావరం.. ప్రపంచమంతా చేస్తున్న ఘోరం

pakistan migrants : పాకిస్తానీల కండకావరం.. ప్రపంచమంతా చేస్తున్న ఘోరం

pakistan migrants : డెన్మార్క్ దేశంలోని ఆ దేశపు డ్యానిష్ పౌరుడితో పాకిస్తాన్ వలసదారుడు గొడవ పెట్టుకున్నాడు. ఏకంగా నాకు డెన్మార్క్ లో ఐదుగురు పిల్లలు అని.. నీకు ఒక్కడే పిల్లాడు అని పదేళ్లలో డెన్మార్క్ లో మీ జనాభా తగ్గి మైనార్టీలుగా మారుతారని.. పాకిస్తానీలం అయిన మేము 10 ఏళ్ల తర్వాత మెజార్టీ జనాభా అవుతామని డ్యానిష్ పౌరుడితోనే వాగ్వాదానికి దిగాడు.. 50 లక్షల జనాభా ఉన్న డెన్మార్క్ లో పాకిస్తానీ ముస్లిం జనాభా పెరిగిపోతుందన్న సవాల్ ఆ పాకిస్తానీ నుంచి వ్యక్తమైంది. ఇది కేవలం డెన్మార్క్ లోనే కాదు.. యూరప్ అంతటా పాకిస్తానీలు ఇలానే చేరుకొని పిల్లలను ఎక్కువగా కని వారి ఆధిపత్యాన్ని జనాభాను పెంచే పనిలో పడ్డారు. వారి దేశంలో వలసదారులుగా ఉంటూ ఆ దేశస్థులనే బెదిరిస్తున్న పాకిస్తానీల కండకావరంను ఏకంగా ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ ట్వీట్ చేయడం సంచలనమైంది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల యూరప్ దేశాలు.. ముఖ్యంగా బ్రిటన్, డెన్మార్క్ వంటి దేశాల్లో వలసదారుల సమస్య మళ్లీ చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ దేశం నుంచి అక్రమంగా వలస వచ్చిన కారణంగా సామాజిక, ఆర్థిక, భద్రతా సమస్యలకు కారణమవుతున్నారని పశ్చిమ మీడియా, పౌర సమాజం ఆరోపిస్తోంది.

– అక్రమ వలసదారుల పెరుగుదల

బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల హోటల్ యజమానులతో ఏడు సంవత్సరాల కాంట్రాక్టులు కుదుర్చుకుంటూ అక్రమ వలసదారులకు వసతి కల్పించేందుకు భారీగా నిధులు ఖర్చు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజానికి సమస్యను తగ్గించకుండా మరింత ప్రోత్సహించే విధానంగా కనిపిస్తోంది. ఒకవైపు సరిహద్దు నియంత్రణలో విఫలం.. మరోవైపు “మానవతావాద” అజెండా ఈ రెండింటి వల్లే వలస సంక్షోభం పెరుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు.

– సామాజిక సమస్యలు

యూరప్‌లోని అనేక నగరాల్లో వలసదారులు స్థానికులతో ఘర్షణలకు దారితీస్తున్నారు. మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి ఆరోపణలు పెరుగుతున్నాయి. దీనివల్ల స్థానిక ప్రజల్లో భద్రతా భయం, సామాజిక విభజన పెరుగుతోంది. “మల్టీకల్చరలిజం” పేరుతో వచ్చిన విధానం వాస్తవానికి సమాజంలో ఉద్రిక్తతలను పెంచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

– రాజకీయ లాభనష్టాలు

వలస సమస్య యూరప్‌లో పార్టీల రాజకీయ అజెండాగా మారిపోయింది. లిబరల్, వామపక్ష పార్టీలు వలసదారులను మానవ హక్కుల కోణంలో చూడాలని కోరుతున్నాయి. కానీ అధికార పార్టీలు మాత్రం సరిహద్దు భద్రత, జాతీయ ప్రయోజనాలను రక్షించడమే ముఖ్యమని వాదిస్తున్నాయి. ఈ విభేదాల వల్ల వలస సంక్షోభంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

– భవిష్యత్ సవాళ్లు

వలసదారులు కొనసాగిస్తే స్థానికుల ఉద్యోగాలు, వనరులు మరింత ఒత్తిడికి లోనవుతాయి. నేరాల పెరుగుదల, భద్రతా సమస్యలు పెరిగే అవకాశం ఉంది. సమాజంలో జాతి, మత ఘర్షణలు తీవ్రమవుతాయి.

– పరిష్కార మార్గాలు

సరిహద్దు నియంత్రణలో కఠిన చర్యలు అవసరం. అక్రమ వలసపై నిషేధాత్మక విధానాలు, త్వరితగతిన తిరిగి పంపే విధానం తేవాలి. వలసలను అనుమతించే దేశాల్లో సాంస్కృతిక సమన్వయం తప్పనిసరి చేయడం. వలసలను ఉపయోగించుకునే రాజకీయ ప్రయోజనాలపై పారదర్శకత ఉండాలి.

వలసదారుల సమస్య మానవతా కోణంలో చూడాల్సిన అంశమే అయినప్పటికీ, ప్రజల భద్రత, జాతీయ ప్రయోజనం కూడా అంతే ముఖ్యమైనవి. బ్రిటన్ సహా యూరప్ దేశాలు తక్షణమే సమతుల్య విధానాలు అమలు చేయకపోతే, రాబోయే దశాబ్దాల్లో వలస సంక్షోభం పెద్ద సామాజిక అగ్నిపర్వతంగా మారే ప్రమాదం ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular