Ali Khamenei: ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని, ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందని అగ్రరాజ్యం అమెరికా మిడిల్ ఈస్ట్లో అగ్గి రాజేసింది. ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం మొదలు పెట్టింది. మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని మట్టుబెట్టింది. అత్యంత విశ్వసనీయమైన సమాచారంతో ఇరాన్ రాడార్లకు చిక్కకుండా లక్ష్యంపై అమెరికా దాడిచేసింది. దీంతో ఖమేనీతోపాటు కీలక అధికారులు, నాయకులు మరణించారు. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. దీంతో యుద్ధం విస్తరిస్తోంది.
Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!
బ్లూ స్పారో ప్రయోగం..
ఖమేనీని చంపడానికి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ’బ్లూ స్పారో’ మిస్సైల్ను ఫిబ్రవరి 28న ప్రయోగించింది. ఈ జెట్–లాంచ్డ్ బలిస్టిక్ మిస్సైల్ అంతరిక్ష సరిహద్దు చేరి హైపర్సోనిక్ వేగంతో టెహ్రాన్లోని ఖమేనీ కాంపౌండ్ను ధ్వంసం చేసింది.
సాంకేతిక విశేషాలు
1900–2000 కేజీల బరువున్న ఈ మిస్సైల్ 2 వేల కి.మీ. పరిధిలో లక్ష్యాలను చేరుకోగలదు. F–15 ఫైటర్ జెట్ల నుంచి ప్రయోగించగా, అది వాయుమండల అంచులకు చేరుకునా శబ్దవేగం (మాక్–5+)తో నిటారుగా దూసుకొస్తుంది. రాడార్ వ్యవస్థలు గుర్తించే ముందే ధ్వంసం చేస్తుంది. మొదట ఏరో డిఫెన్స్ టెస్ట్ కోసం రూపొందించగా ఇప్పుడు ఆఫెన్సివ్ వాయుధంగా మారింది.
ఆపరేషన్ ఇలా..
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో మొసాద్, సీఐఏ, యూనిట్ 8200 కలిసి సంవత్సరాలు ఖమేనీ కదలికలను ట్రాక్ చేశాయి. సైబర్ దాడులతో కమ్యూనికేషన్లు అడ్డుకుని, ఉదయం 9:40కి 30+ మిస్సైల్స్ (బ్లూ స్పారో, బ్లాక్ స్పారో, రాంపేజ్) ప్రయోగించారు. ఈ దాడిలో ఖమేనీ, భార్య, సీనియర్ అధికారులు మరణించారు. బంకర్లు కూడా ధ్వంసమయ్యాయి.
రక్షణ వ్యవస్థల లోపాలు
ఇరాన్ ఎస్–300, బుక్ సిస్టమ్లు ఈ మిస్సైల్ను గుర్తించలేదు. ఎందుకంటే అది అంతరిక్ష ట్రాజెక్టరీలో ప్రయాణిస్తుంది. గైడెన్స్ సిస్టమ్ టేబుల్స్థాయి టార్గెట్లను కూడా చిత్తు చేస్తుంది. ఇజ్రాయెల్ ముందుగా రాడార్లు, కమాండ్ సెంటర్లను నష్టపరిచి దాడి సులభతరం చేసింది.
ఖమేనీ మరణంతో ఇరాన్లో 40 రోజుల దుఃఖం, నాయకత్వ లోపం ఏర్పడింది. ఇరాన్ గల్ఫ్ దేశాలు, అమెరికా స్థావరాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ సాంకేతికత డెకాపిటేషన్ స్ట్రైక్లకు మార్గదర్శకంగా మారి, భవిష్యత్ రక్షణ వ్యవస్థల డిజైన్ను మార్చవచ్చు.