Bangladesh Air Force Purge: బంగ్లాదేశ్ వైమానిక దళంలో ఇటీవల చేపట్టిన ప్రక్షాళన చేపట్టింది. మహ్మద్ యూనస్ పాలనలో వైమానికదళాన్ని మొత్తం భ్రష్టుపట్టించాడు. పాకిస్తాన్ అనుకూలులకు పదవులు కట్టబెట్టారు. ఐఎస్ఐ జోక్యం పెరిగింది. భారత సరిహద్దులో ఉన్న ఎయిర్ బేస్లు, రాడార్ కేంద్రాల నుంచి భారత సమాచారం, కదలికల వివరాలను పాకిస్తాన్కు పంపేలా ఏర్పాట్లు చేసుకుంది. తాజాగా చేపట్టిన ప్రక్షాళనతో ఆ దేశ భద్రతతో పాటు, పొరుగు దేశమైన భారత్కు కూడా వ్యూహాత్మకంగా ఎంతో కీలకం.
ఎయిర్ ఫోర్స్లో కీలక పరిణామాలు
బంగ్లాదేశ్ తన వైమానిక దళంలో అంతర్గత భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఏప్రిల్ 20 నుంచి భారీ ప్రక్షాళనను ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా స్క్వాడ్రన్ లీడర్ స్థాయి అధికారుల నుంచి ఎయిర్ క్రాఫ్ట్ మెన్ వరకు అనేకమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సిబ్బంది తమ మొబైల్ ఫోన్లను అధికారులకు అప్పగించాలని, ఎటువంటి సమాచారాన్ని తొలగించకూడదని కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి.
పెరిగిన ఐఎస్ఐ ప్రభావం..
బంగ్లాదేశ్ రక్షణ వ్యవస్థలో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రభావం పెరగడం భారత్కు ప్రధాన ఆందోళనగా మారింది. రాడార్ స్టేషన్లు, ఎయిర్ బేస్లలోని కొందరు కీలక అధికారులు పాకిస్తాన్ అనుకూల ధోరణిని ప్రదర్శిస్తూ, వ్యూహాత్మక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని రాడార్ కేంద్రాల ద్వారా భారత వైమానిక దళం యొక్క కదలికలను గమనించి, ఆ వివరాలను పాకిస్తాన్కు పంపడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లిందని విశ్లేషణలు చెబుతున్నాయి.
దౌత్యపరమైన సంబంధాలు..
ఈ ప్రక్షాళన వెనుక ఇరు దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు కీలక పాత్ర పోషించాయి. ఏప్రిల్ 2026 ప్రారంభంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీల్ ఉర్ రహమాన్ భారత పర్యటనలో భాగంగా, ఇరు దేశాల మధ్య కరెన్సీ స్వాప్ ఒప్పందం, ఆర్థిక సహకారంపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో భారత్ తన సరిహద్దు భద్రతకు సంబంధించిన ఆందోళనలను వ్యక్తం చేయగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందిస్తూ వైమానిక దళంలో చొరబాట్లను అరికట్టేందుకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రక్షాళన మొదలు పెట్టింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ జమాన్ వంటి భారత్ అనుకూల వ్యక్తులు వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్కు, భారత్ అందిస్తున్న సహకారం రానున్న కాలంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత దృఢం కానుంది. మాల్దీవులు కూడా ఇటీవలే కరెన్సీ స్వాప్ చేసుకుంది. దీంతో ఇరు దేశాలకు లాభం జరుగుతుంది.
