Balochistan
Balochistan : బలూచిస్తాన్, పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్. సుమారు 44% భూభాగాన్ని కలిగి ఉన్నప్పటికీ, అత్యంత పేదరికంలో మగ్గుతున్న ప్రాంతంగా మిగిలిపోయింది. ఈ ప్రాంతం సహజ వాయువు, బంగారం, రాగి వంటి వనరులతో సమృద్ధిగా ఉంది, కానీ బలూచ్ జాతీయవాదుల అభిప్రాయం ప్రకారం, ఈ సంపద స్థానిక బలూచ్ ప్రజలకు లాభం చేకూర్చడం లేదు. బదులుగా, పాకిస్తాన్(Pakisthan)కేంద్ర ప్రభుత్వం, చైనా(China) దీనిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ట్రూడో వారసుడు కార్నీ.. కెనడా కొత్త ప్రధానిగా ఎన్నిక..
చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్..
చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC) అనేది చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా బలూచిస్తాన్లోని గ్వాదర్ ఓడరేవును అభివృద్ధి చేసే ఒక ప్రధాన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా బలూచిస్తాన్లో భారీ పెట్టుబడులు పెడుతోంది, ఇందులో రోడ్లు, రైల్వేలు, శక్తి ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే, బలూచ్ జాతీయవాదులు ఈ ప్రాజెక్ట్ను ‘వలసవాద దోపిడీ‘గా భావిస్తున్నారు. వారి వాదన ప్రకారం, ఇ్కఉఇ ద్వారా గ్వాదర్ ఓడరేవు నుండి వచ్చే లాభాలు స్థానిక బలూచ్ ప్రజలకు చేరడం లేదు, బదులుగా చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఈ వనరులను తమ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి. గ్వాదర్ ఓడరేవు 2013లో చైనా నియంత్రణలోకి వచ్చింది. ఇది చైనా 65 బిలియన్ డాలర్ల పెట్టుబడిలో భాగం. బలూచ్ జాతీయవాదులు ఈ ప్రాజెక్ట్ను తమ భూమిని ఆక్రమించడం, స్థానిక జనాభాను ఆర్థికంగా, సామాజికంగా అణచివేయడంగా చూస్తున్నారు. వారు చైనా సైన్యం కూడా బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉందని, తమ విమోచన ఉద్యమాన్ని అణచివేయడానికి సహాయం చేస్తోందని ఆరోపిస్తున్నారు.
బలూచ్ జాతీయవాదుల ఆందోళనలు
సహజ వనరుల దోపిడీ: బలూచిస్తాన్లోని సుయి ప్రాంతం నుంచి వచ్చే సహజ వాయువు దశాబ్దాలుగా పాకిస్తాన్ అంతటా విద్యుత్ ఉత్పత్తి, గృహ వినియోగానికి ఉపయోగించబడుతోంది, కానీ స్థానికులకు దాని లాభం తక్కువగానే దక్కుతోంది.
ఆర్థిక నిర్లక్ష్యం: బలూచిస్తాన్లో సుమారు 90% గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు, విద్య, ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేవు. స్థానికుల ఆదాయం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.
జనాభా మార్పు భయం: CPEC ప్రాజెక్టుల కారణంగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే వారి సంఖ్య పెరగడం వల్ల స్థానిక బలూచ్ జనాభా మైనారిటీగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బలూచ్ జాతీయవాదులు, ముఖ్యంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి సాయుధ సంస్థలు, పాకిస్తాన్ సైన్యం, చైనా సంస్థలపై దాడులు చేస్తున్నాయి. 2018లో కరాచీలోని చైనా కాన్సులేట్పై BLA దాడి చేసింది. గ్వాదర్లో చైనా ఇంజనీర్లను లక్ష్యంగా చేసిన దాడులు కూడా జరిగాయి. వారి లక్ష్యం పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం సాధించడం మరియు చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం.
బలూచ్ జాతీయవాదులు పాకిస్తాన్ మరియు చైనాలను తమ సంపదను దోచుకుంటున్న వలసవాద శక్తులుగా చూస్తున్నారు. వారి పోరాటం ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం, స్వీయ–నిర్ణయం కోసం జరుగుతోంది. ఈ వివాదం పాకిస్తాన్లో రాజకీయ అస్థిరతను పెంచడమే కాక, చైనా యొక్క CPEC ప్రాజెక్టులకు కూడా ఆటంకం కలిగిస్తోంది.
Also Read : యుద్ధానికైనా సిద్ధమే.. ట్రంప్ బెదిరింపులపై స్పందించిన చైనా.. ట్రేడ్ వార్.. రియల్ వార్ అవుతుందా?
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Balochistan is fighting militants over pakistan and china
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com