Baloch Liberation Army: ఉగ్రదాడులతో గతంలో భారత్ మీద పైశాచికత్వాన్ని ప్రదర్శించింది పాకిస్తాన్. దీనికి మనదేశంలో ఉన్న కొంతమంది నాయకులు కూడా పాకిస్తాన్ దేశానికి సహకరించారు. సరిహద్దుల్లో దారుణాలు సృష్టించడం.. రక్తపాతాన్ని కొనసాగించడం.. నకిలీ కరెన్సీని స్ప్రెడ్ చేయడం.. దేశంలో అలలు సృష్టించడానికి కుట్రలు చేయడం.. ఇలా ఎన్నో దారుణాలకు పాకిస్తాన్ పాల్పడింది. చివరికి అంతర్జాతీయ వేదికల మీద కూడా తనను తాను బాధిత దేశంగా పేర్కొంది. భారత్ మీద లేనిపోని విమర్శలు చేసింది. చివరికి చైనా సహకారంతో.. రచ్చ రచ్చ చేసింది.
పాకిస్తాన్ కుట్రలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. సరిహద్దుల్లో గట్టిగా కాదు.. చెవులు పలిగి పోయే విధంగా పాకిస్తాన్ దేశానికి సమాధానం చెప్పింది. పాకిస్తాన్ దేశానికి ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్య పేరు బలూజ్. కొంతకాలంగా ఇక్కడి ప్రాంత ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి తమకు స్వాతంత్రం కావాలని నిరసనలు చేపడుతున్నారు.. అక్కడ ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆ ప్రాంతం మీద దారుణంగా దాడులు చేస్తుంది. ప్రజలను అత్యంత క్రూరంగా హతమార్చుతోంది.
పాకిస్తాన్ ఆర్మీ తమను ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అదును చూసి దెబ్బ కొట్టింది. పాకిస్థాన్లోని గ్వాదర్ కోస్ట్ గార్డ్ ఆర్మీ క్యాంప్ మీద దాడి చేసింది. ఈ దాడిలో ఏకంగా 30 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. మరి కొంతమంది గాయపడ్డారు. దానికి సంబంధించిన వీడియోలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ వీడియోలను పోస్ట్ చేసింది. ఇందులో ఒక వ్యాన్ లో పేలుడు పదార్థాలను నింపి.. ఆర్మీ క్యాంప్ సమీపంలోకి పంపించింది. ఆ తర్వాత బలుచ్ ఆర్మీ నిర్వాహకులు ఆ వ్యాన్ ను పేల్చేశారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం పేలిపోయింది. క్యాంపు లో పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది.
చూస్తుండగానే మంటలు వచ్చాయి. ఆ మంటల తాకిడికి చాలామంది చనిపోయారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ పేలుడు శబ్దం కిలోమీటర్ల వరకు వినిపించింది. ఏం జరిగిందో తెలిసే లోపే పాకిస్తాన్ ఆర్మీకి భీకరమైన నష్టం వాటిల్లింది. 30 మంది పాకిస్తాన్ ఆర్మీ చనిపోవడంతో బలూజ్ ఆర్మీ స్థాయి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ బలూచ్ మీద విరుచుకుపడే అవకాశం ఉంది. మరి దీనికి బలూచ్ లిబ్రేషన్ ఆర్మీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.

