Homeఅంతర్జాతీయంAphelion phenomenon 2025: భూమికి దూరంగా సూర్యుడు.. రేపటి నుంచి జాగ్రత్త.. మునుపెన్నడూ చూడని చల్లని...

Aphelion phenomenon 2025: భూమికి దూరంగా సూర్యుడు.. రేపటి నుంచి జాగ్రత్త.. మునుపెన్నడూ చూడని చల్లని ఉష్ణోగ్రతలు.. హై అలెర్ట్

Aphelion phenomenon 2025: దేశంలో ప్రస్తుతం వర్షాలు విజృంభిస్తున్నాయి. మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రత కారణంగా ఉక్కపోత అనుభవించిన వారు ఇప్పుడు చల్లని వాతావరణంలో హాయిగా ఉండగలుగుతున్నారు. దాదాపు దేశ వ్యాప్తంగా వర్షాలు ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం భారత్ కు ఉత్తరంలో ఉన్న లడఖ్ ప్రాంతంలో మైనస్ 45 డిగ్రీల సెల్సీయస్ నమోదవుతోంది. అయితే మిగతా ప్రాంతాల్లో వాతావరణం చల్లగా ఉన్నా.. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నాయి. అయితే ఆగస్టు 20 నుంచి 22 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో అఫెలియన్ (Aphelion)ఫినామినాన్ వాతావరణం ఉండనుంది. ఇందుకు కారణం భూమికి సూర్యుడు మరింత దూరం వెళ్లనున్నారు. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయి. ఈ సమయంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలేంటీ అఫెలియన్ ఫినామినాన్? ఇది ఎప్పుడు వస్తుంది?

సాధారణగా భూమికి, సూర్యుడికి మధ్య దూరం 90,000, 000కిలోమీటర్లు. ఇంత దూరం నుంచి సూర్యుడు పంచే వేడితో జీవులు, మనుషులు బతుకగలుగుతున్నారు. ఒక్కోసారి భూమికి దగ్గరగా సూర్యుడు రావడంతో అధిక వేడితో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మార్చి నుంచి జూన్ వరకు ఆ పరిస్థిత ఉండే అవకాశం ఉంది. అయితే ప్రతీ ఏడాది జూలై లేదా ఆగస్టులో అఫెలియన్ ఫినామినాన్ ఏర్పడుతుంది. అంటే ఈ సమయంలో సూర్యుడు 152 మిలియన్ దూరానికి వెళ్తాడు. దీంతో భూమి వాతావరణం మరింత చల్లగా మారుతుంది. ఇది సాధారణం కంటే 66 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

సాధారణంగా వేసవి కాలం పూర్తయిన తరువాత వర్షాల కారణంగా సూర్యడు కనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆ తరువాత వచ్చే చలికాలంలో సూర్య కిరణాలు భూమిపై పడినా.. వాతావరణం చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు భూమికి 150 మిలియన్ దూరంలో ఉంటాడు. కానీ అఫెలియన్ ఫినామినాన్ సమయంలో 2 మిలియన్ల దూరం వెళ్తాడు. 2025 ఏడాదిలో ఆగస్టు 20 నుంచి 22 వరకు అఫెలియన్ ఫినామినాన్ వాతావరణం ఉండనుంది అని వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: శాస్త్రీయ ఆధారాలతో మహాభారత యుద్ధ కాలం తెలిసింది

అఫెలియన్ ఫినామినాన్ వాతావరణం ఉన్నందువల్ల భూమి మరింత చల్లగా మారుతుంది. ఈ సమయంలో వ్యాధులు విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అస్తమా, ఇతర వ్యాధులు ఉన్నవారు ఈ వాతావరణంలో మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో గొంతునొప్పి, జ్వరం, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అందువల్ల ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

అఫెలియన్ ఫినామినాన్ ఆగస్టు 20న ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రారంభం అవుతుంది. అందువల్ల ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version