spot_img
Homeఅంతర్జాతీయంAmerica Nuclear Bomb History: అణు బాంబులు వద్దని ప్రపంచానికి సుద్ధులు చెబుతుంది గాని.. ప్రథమ...

America Nuclear Bomb History: అణు బాంబులు వద్దని ప్రపంచానికి సుద్ధులు చెబుతుంది గాని.. ప్రథమ ముద్దాయి అమెరికానే!

America Nuclear Bomb History: వెనుకటికి తో వ్యక్తి ఊరందరికీ నీతులు చెప్పేవాడు. ముఖ్యంగా కూరల్లో ఉల్లిపాయలు వేసుకోవద్దని చెప్పేవాడు. దానివల్ల అనవసరమైన సమస్యలు ఎదురవుతాయని వివరించేవాడు. తను మాత్రం కూరల్లో ఉల్లిపాయలు వేయకుండా తన ఇల్లాలి మీద మండిపడేవాడు. అదేంటి ఊరందరినీ ఉల్లిపాయలు తినవద్దని చెప్పి.. మీరు ఎందుకు తింటున్నారు అని ఆమె అడిగితే.. “పిచ్చి మొహమా.. అది ఊరి వాళ్లకు.. నాకు కాదు” అంటూ ఆమెకు సమాధానంగా చెప్పేవాడు.

పై ఉపోద్ఘాతం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు.. అమెరికా వ్యవహార శైలికి.. ప్రపంచం మీద ఆ దేశం సాగిస్తున్న పెత్తనానికి బలమైన నిదర్శనం. అమెరికాలో ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడు మారిపోతాడు. కానీ అమెరికా ప్రయోజనాల విషయంలో వారి వ్యవహార శైలి ఏ మాత్రం మారదు. పైగా యుద్ధాలు చేయడంలో.. గిట్టని దేశాలను తొక్కి పెట్టడంలో అమెరికా తర్వాతే ఎవరైనా. అందువల్లే అమెరికా అంటే చాలు కొన్ని దేశాలు భయపడిపోతుంటాయి. ఆంక్షలు విధిస్తుందని వణికి పోతుంటాయి. ఇటీవల కాలంలో పరిస్థితిలో కాస్త మార్పు వచ్చినప్పటికీ.. మెజారిటీ దేశాలకు అమెరికా అంటే ఇప్పటికీ భయమే. ఎందుకంటే తన ప్రయోజనాల కోసం అమెరికా ఏదైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. ఎక్కడ దాకా అయినా ప్రయాణం చేస్తుంది. ప్రపంచం మొత్తం తన కాళ్ళ కింద ఉండాలని.. ప్రపంచం నెత్తిమీద తను ఉండాలని అమెరికాను పాలించే పాలకులు కోరుకుంటారు. అందువల్లే ప్రతి ఏడాది ఆ దేశానికి సంబంధించి మిలిటరీకి విపరీతమైన బడ్జెట్ కేటాయిస్తుంటారు. ఇక ఆయుధాల తయారీ గురించి.. బాంబుల రూపకల్పన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read:  Nuclear Bomb : అణు బాంబు పేలిన ప్రదేశానికి 20 కి.మీ దూరంలో ఉన్నారు.. మీరు మీ ప్రాణాలను కాపాడుకోగలరా ?

ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తున్నదని.. అది ప్రపంచానికి మంచిది కాదని ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక సందర్భాల్లో చెప్పారు. అందువల్లే తాము ఆ దేశం మీద దాడి చేస్తున్నామని ప్రకటించారు. ఇరాన్ అధ్యక్షుడు తక్షణమే లొంగిపోవాలని.. ఆయన వల్ల ప్రపంచం ముప్పు ఎదుర్కొంటుందని ట్రంప్ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. వాస్తవానికి ఈ ప్రపంచంలో అతిపెద్ద అణు బాంబులు ఉన్న రెండవ దేశం అమెరికానే.. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో తొమ్మిది దేశాల వద్ద మాత్రమే న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. అందులో రష్యా వద్ద 5,580 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. ఆ తర్వాత అమెరికా వద్ద 5044 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. చైనాలో 500, ఫ్రాన్స్ లో 290, యూకే లో 225, భారత దేశంలో 172, పాకిస్తాన్లో 170, ఇజ్రాయెల్ లో 90, నార్త్ కొరియాలో 50 బాంబులు ఉన్నాయి.

వాస్తవానికి న్యూక్లియర్ బాంబులు తయారు చేయకూడదని.. న్యూక్లియర్ బాంబుల వల్ల ప్రపంచం నాశనం అవుతుందని రష్యా ఇంతవరకు ఎన్నడూ చెప్పలేదు. చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే రష్యా స్టాండ్ మొదటి నుంచి ఒకే విధంగా ఉంటుంది. కానీ అమెరికా అలా కాదు.. దాని ప్రయోజనాలకు అనుగుణంగా మారిపోతూ ఉంటుంది. అందువల్లే ఆ దేశం మీద ప్రపంచ అధినేతలకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉండదు. అమెరికా తన వద్ద న్యూక్లియర్ బాంబులు ఉన్నప్పటికీ.. తనను తాను సర్వ పరిత్యాగి దేశం లాగా చెప్పుకుంటుంది. ఇక ఉత్తరకొరియాలో న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్న నేపథ్యంలో అమెరికా ఏకంగా ఆంక్షలు విధించింది. ప్రపంచ దేశాలు కూడా తన బాటలోనే నడవాలని స్పష్టం చేసింది. అయితే దీనిని కొన్ని దేశాలు వ్యతిరేకించాయి.. తనను వ్యతిరేకించిన దేశాలపై అమెరికా ఆంక్షలు విధించింది. వాటిని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. ఇక ప్రపంచంలో అణుబాబు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. జపాన్ దేశంలో హిరోషిమా, నాగసాకి పట్టణాలపై ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా అణుబాంబులు వేస్తే ఏకంగా 1.29 లక్షల మంది చనిపోయారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper