కోడలు కోసం నాలుక కోసుకున్న అత్త.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!

కాలం మారుతోంది. టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే నేటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలు మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ మూఢ నమ్మకాల వల్ల అనేక దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక మహిళ మూఢనమ్మకం వల్ల తన నాలుకను కోసుకుంది. తప్పిపోయిన కోడలు సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని శివుడికి నాలుకను సమర్పించింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్ లోని సెరైకెలా ఖర్సావన్ జిల్లాలో […]

Written By: Navya, Updated On : August 19, 2020 3:42 pm
Follow us on

కాలం మారుతోంది. టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే నేటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలు మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ మూఢ నమ్మకాల వల్ల అనేక దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక మహిళ మూఢనమ్మకం వల్ల తన నాలుకను కోసుకుంది. తప్పిపోయిన కోడలు సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని శివుడికి నాలుకను సమర్పించింది.

జార్ఖండ్ రాష్ట్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్ లోని సెరైకెలా ఖర్సావన్ జిల్లాలో ఎన్.ఐ.టీ క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్ లో లక్ష్మీ నిరాలా కోడలు జ్యోతి తన బిడ్డతో పాటు తప్పిపోయింది. కోడలు, మనవడు తప్పిపోవడంతో లక్ష్మీ అక్కడే ఉన్న శివుడి గుడి ముందు కోడలు, మనవడి కోసం ప్రార్థిస్తూ తన నాలుకను కత్తిరించుకుంది. ఎవరో నాలుకను కత్తిరించుకుంటే కోడలు తిరిగి వస్తుందని చెప్పడంతో లక్ష్మీ ఈ విధంగా చేసింది.

లక్ష్మీ భర్త నందూలాల్ మీడియాకు ఈ వివరాలను తెలియజేశారు. నాలుక కత్తిరించుకున్న అనంతరం లక్ష్మీకి తీవ్ర రక్తస్రావమైంది. అయినప్పటికీ ఆమె కోడలు, మనవడి కోసం ఎదురు చూస్తూ ఆస్పత్రికి వెళ్లడానికి నిరాకరించారు. అక్కడి స్థానికులు ఆమెకు నచ్చజెప్పడంతో చివరకు ఆస్పత్రికి వెళ్లడానికి ఆమె అంగీకరించారు. వైద్యులు నాలుక పూర్తిగా తెగడంతో లక్ష్మీ మాట్లాడలేకపోతున్నారని ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు. పోలీసులు తప్పిపోయిన కోడలు జ్యోతి, బిడ్డ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.