Homeట్రెండింగ్ న్యూస్Dog Death Anniversary: ఆ కుటుంబ స్థితినే మార్చేసిన కుక్క.. చనిపోతే ఏం చేశారంటే?

Dog Death Anniversary: ఆ కుటుంబ స్థితినే మార్చేసిన కుక్క.. చనిపోతే ఏం చేశారంటే?

Dog Death Anniversary: ఆ మూగజీవిని పెంచిన నాటి నుంచి ఆ ఇంటికి కలిసి వచ్చింది. ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చారు. సొంత ఇంటిని నిర్మించుకున్నారు. కుమారులు ఇద్దరు సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడ్డారు. ఒక ఐటీ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఆ మూగజీవి అనారోగ్యంతో కన్ను మూసింది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరయింది. ఆ మూగ జీవికి ఏకంగా సమాధి నిర్మించి.. పూజలు చేయడం ఆ కుటుంబానికి నిత్య కృత్యంగా మారింది.

కడప బిల్డప్ సర్కిల్లో బాలు, సౌజి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు 2008లో ఒక కుక్కను తెచ్చుకొని పెంచుకోవడం ప్రారంభించారు. దానికి ముద్దుగా టైసన్ శర్మ అని పేరు పెట్టుకున్నారు. ఇంటిల్లపాదికి కుక్కతో అనుబంధం ఉండేది. అయితే టైసన్ శర్మ 2018 జూలై 29న చనిపోయింది. సమీపంలోని మరియాపురం స్మశానములో ఖననం చేసి సమాధి నిర్మించారు. నిత్యం ఆ సమాధి వద్ద పూజలు చేసి కుక్క జ్ఞాపకాలను స్మరించుకుంటున్నారు. పదిమందికి అన్నం పెడుతుంటారు.

టైసన్ శర్మ అడుగుపెట్టిన తర్వాత కుటుంబ పరిస్థితులే మారిపోయాయని వారు చెబుతున్నారు. అప్పటివరకు వారు అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. కుక్క వచ్చిన వేళా విశేషం ఏమిటో తెలియదు గానీ సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాదులో ఏకంగా సొంత కంపెనీని ప్రారంభించారు. ఆర్థికంగా ఎంతో వృద్ధి సాధించారు. దీనంతటికీ కారణం టైసన్ శర్మ అని వారి ప్రగాఢ నమ్మకం. కానీ కుక్క అర్ధాంతరంగా చనిపోవడంతో వారి బాధ వర్ణనాతీతం. అందుకే కుక్కను ఖననం చేసిన చోట సమాధిని నిర్మించారు. నిత్య పూజలు చేస్తున్నారు. శనివారం ఐదో వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. సమాధి వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. పదిమందికి అన్నదానం చేశారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version