Mumbai: చెంప దెబ్బ ఎంత పని చేసింది?!

ముంబైలో అవినాష్, శీతల్ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరు మంఖార్డ్ వెళ్లడానికి సీయోను రైల్వే స్టేషన్ కు ఆదివారం రాత్రి చేరుకున్నారు. ఆ సమయంలో దినేష్ (26) అనే యువకుడు శీతల్ పక్కనే నిలుచున్నాడు.

Written By: Bhaskar, Updated On : August 18, 2023 1:07 pm

Mumbai

Follow us on

Mumbai: అదే ముంబై రైల్వేస్టేషన్. ప్రయాణికులతో రద్దీగా ఉంది. వచ్చి పోయే రైళ్ళు ఆ ప్రాంతాన్ని హోరెత్తిస్తున్నాయి. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏం జరిగిందని తోటి ప్రయాణికులు చూస్తే.. ఒక వ్యక్తి కళ్ళముందే ప్రాణాలు కోల్పోయాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంటే..

ముంబైలో అవినాష్, శీతల్ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరు మంఖార్డ్ వెళ్లడానికి సీయోను రైల్వే స్టేషన్ కు ఆదివారం రాత్రి చేరుకున్నారు. ఆ సమయంలో దినేష్ (26) అనే యువకుడు శీతల్ పక్కనే నిలుచున్నాడు. అయితే అతడు తనను తోసేశాడని శీతల్ ఆరోపించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త పెద్ద గొడవగా మారింది. దినేష్ ను శీతల్ తన చేతిలో ఉన్న గొడుగుతో కొట్టింది. ఆ తర్వాత అవినాష్ కూడా తన భార్య శీతల్ కు జత కలిశాడు. దినేష్ ను బలంగా చెంప మీద కొట్టాడు. దీంతో దినేష్ ప్లాట్ ఫామ్ పై నుంచి రైల్వే ట్రాక్ పై పడిపోయాడు.

అయితే తిరిగి ప్లాట్ ఫామ్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అంతలోనే అదే ట్రాక్ పై వేగంగా ఒక రైలు దూసుకు వస్తోంది. ఆ రైలు చూసి దినేష్ కు సహాయం చేసేందుకు వచ్చిన వారు కూడా పారిపోయారు. దీంతో రెప్పపాటులో ఆ రైలు దినేష్ పైనుంచి దూసుకుపోయింది. దీంతో దినేష్ అక్కడికక్కడే మరణించాడు. దినేష్ మరణంతో అవినాష్, శీతల్ పారిపోయారు. దారావి లోని తమ ఇంటికి వెళ్లిపోయారు. దినేష్ , శీతల్ ను పోలీసులు గుర్తించారు. వారినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.