spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TTD: హవ్వా.. ఏడుకొండలవాడికి మూడు కోట్ల ఫైనా?.. ఏంటి అన్యాయం?

TTD: హవ్వా.. ఏడుకొండలవాడికి మూడు కోట్ల ఫైనా?.. ఏంటి అన్యాయం?

TTD
TTD

TTD: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసుల వాడు అని పేరు ఉంది. ఆ స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే కోట్లాదిమంది భక్తులు ఇచ్చే విరాళాలపై కేంద్రం టీటీడీ ఆలయానికి జరిమానా విధించడం గమనార్హం. టీటీడీ దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు జరిమానా విధించింది. దీనిపై సామాజిక వేదికల సామాజిక మాధ్యమాలు వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సిఆర్ఏ) కింద పొందిన లైసెన్స్ గడువు ముగిసిన రెన్యువల్ చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కేంద్ర మూడు కోట్ల భారీ జరిమానా విధించింది. లైసెన్సు రెన్యువల్ చేసుకోని కారణంగా శ్రీవారికి విదేశీ భక్తులు హుండీ కానుకల కింద చెల్లించిన విదేశీ కరెన్సీ రూ. 30 కోట్ల మేరకు టీటీడీ ఖాతాలో డిపాజిట్ కాకుండా ఎస్బిఐ వద్ద మూలుగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో భక్తులు విదేశీ కరెన్సీ కూడా వేస్తుంటారు. గతంలో ఆ విదేశీ నగదును ఆర్బిఐ ద్వారా టిటిడి మన కరెన్సీలోకి మార్చుకునేది.

లైసెన్సు గడువు ముగియడంతో సమస్య..

కేంద్ర హోంశాఖ నుంచి ఎఫ్సిఆర్ఎ చట్టం కింద టీటీడీ లైసెన్సు తీసుకుంది. 2018లో దాని కాల పరిమిత ముగిసింది. టిటిడి యంత్రాంగం లైసెన్స్ పునరుద్ధరణను పట్టించుకోలేదు. ఎఫ్సిఆర్ఏ విభాగం 2019లో దీనిని గుర్తించింది. లైసెన్సు లేకపోయినా టిటిడి విదేశీ విరాళాలు సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రూ.1.14 కోట్లు జరిమానా విధించింది. అప్పటి నుంచి విదేశీ కరెన్సీ మారకానికి ఆర్బిఐ అంగీకరించడం లేదు.

రూ.30 కోట్లు ఆర్బీఐ వద్ద పెండింగ్..

విదేశీ మార్గానికి ఆర్బిఐ అంగీకరించకపోవడం వలన 2018 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.30 కోట్ల మేరకు విదేశీ కరెన్సీ టిటిడి ఖాతాలో జమ కాకుండా ఎస్బిఐ మూలుగుతోంది. టీటీడీ ఆలస్యంగా అందజేసిన ఆదాయ వివరాలను కూడా సక్రమ ఫార్మాట్లో ఇవ్వలేదంటూ కేంద్రం తాజాగా మరో రూ.3.19 కోట్లు జరిమానా విధించింది. దీంతో జరిమానా మొత్తం 4.33 కోట్లకు చేరుకుంది. కేంద్ర మాజీ మంత్రి జయరాం రమేష్ ట్వేట్తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే కేంద్రం విధించిన మూడు కోట్ల జరిమానా చెల్లించామని టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సోమవారం తిరుమలలో మీడియాకు తెలిపారు.

TTD
TTD

సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు..

ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి జరిమానా విధించిన కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గతంలో కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వారి పరిస్థితి ఏమైందో, ఇప్పుడు జరిమానా విధించిన వారి పరిస్థితి అదే అవుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే ప్రముఖ దేవస్థానంగా వెలుగొందుతున్న టీటీడీకి జరిమానా విధించడం హాస్యాస్పదంగా ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు. హిందూమత ఉద్దారకులుగా చెప్పుకునే బిజెపి నాయకులకు ఇది కనిపించడం లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Most Popular

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Oktelugu Epaper
Exit mobile version