Samantha Ruthprabhu : సమంత ఆపు నీ డ్రామాలు… నిర్మాత ఫైర్!

Samantha Ruthprabhu : సమంత అనారోగ్యం అంతా నటనే అంటూ విరుచుకుపడుతున్నారు నిర్మాత చిట్టిబాబు. ఆయన మరోసారి సమంత మీద ఆరోపణలు గుప్పించారు. శాకుంతలం మూవీ ప్రమోషన్లో సమంత మళ్ళీ తాను అనారోగ్యం బారినపడ్డానంటూ ట్వీట్ చేశారు. వరుస ఈవెంట్స్ కారణంగా జ్వరం వచ్చింది. నా గొంతు కూడా పోయిందంటూ ట్వీట్ చేసింది. సమంత చర్యలను నిర్మాత చిట్టిబాబు తప్పుబట్టారు. సమంతది అంతా నాటకం అంటూ మండిపడ్డారు. సమంత విడాకుల తర్వాత పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసింది. […]

Written By: NARESH, Updated On : April 14, 2023 9:37 pm
Follow us on

Samantha Ruthprabhu : సమంత అనారోగ్యం అంతా నటనే అంటూ విరుచుకుపడుతున్నారు నిర్మాత చిట్టిబాబు. ఆయన మరోసారి సమంత మీద ఆరోపణలు గుప్పించారు. శాకుంతలం మూవీ ప్రమోషన్లో సమంత మళ్ళీ తాను అనారోగ్యం బారినపడ్డానంటూ ట్వీట్ చేశారు. వరుస ఈవెంట్స్ కారణంగా జ్వరం వచ్చింది. నా గొంతు కూడా పోయిందంటూ ట్వీట్ చేసింది. సమంత చర్యలను నిర్మాత చిట్టిబాబు తప్పుబట్టారు. సమంతది అంతా నాటకం అంటూ మండిపడ్డారు. సమంత విడాకుల తర్వాత పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసింది. ఆమె బ్రతుకు దెరువు కోసం వచ్చిన ఆఫర్స్ చేసుకుంటూ పోతుంది. హీరోయిన్ గా ఆమె స్టార్డమ్ ఎప్పుడో పోయింది. తిరిగి ఆమె స్టార్ కాలేదు.

యశోద మూవీ విడుదల సమయంలో ఇలానే ఆరోగ్యం బాగోలేదు అని ఏడ్చింది. ఆ మూవీని సక్సెస్ చేయడం కోసం సింపతీ కార్డు వాడింది. మళ్ళీ శాకుంతలం చిత్రానికి సేమ్ ట్రిక్ ప్లే చేస్తుంది. ప్రతిసారి డ్రామాలు వర్కవుట్ కావు. సినిమా బాగుంటే, పెర్ఫార్మన్స్ నచ్చితే చూస్తారు. నేను చచ్చిపోతానన్న మాత్రాన ప్రేక్షకులు సినిమా చూడరు. అయితే ఫేడ్ అవుటైన సమంతను శకుంతల పాత్రకు ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. శాకుంతలం చిత్రం మీద నాకు ఏమాత్రం ఆసక్తిలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూడా చిట్టిబాబు సమంత మీద ఇదే స్థాయిలో విరుచుకుపడ్డారు. మయోసైటిస్ అందరికీ వచ్చే వ్యాధే. అదేమీ ప్రాణాలు తీసే రోగం కాదు. సమంత మాత్రం ఆ రోగం పేరు చెప్పి సినిమాను సక్సెస్ చేయాలని చూస్తుందంటూ ఎద్దేవా చేశాడు. ప్రతిసారి సమంతను చిట్టిబాబు టార్గెట్ చేస్తున్నారు. ఆమె ప్రవర్తన చిట్టిబాబు నచ్చడం లేదా? లేక అక్కినేని ఫ్యామిలీ విషయంలో తప్పు చేసిందన్న అసహనం ఉందా? అని కొందరు అభిప్రాయం పడుతున్నారు.

కాగా శాకుంతలం చిత్రాన్ని ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. మణిశర్మ సంగీతం అందించారు. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సమంత టైటిల్ రోల్ చేశారు. దేవ్ మోహన్ దుష్యంతుడిగా సమంతతో జతకట్టారు. అల్లు అర్హ బాల భరతుడు పాత్ర చేయడం విశేషం.