Homeఎంటర్టైన్మెంట్Sarkari Vaari Paata Prabhas: సర్కార్‌వారి పాట సినిమా చూసిన ప్రభాస్‌.. మహేశ్‌ నటనపై సంచలన...

Sarkari Vaari Paata Prabhas: సర్కార్‌వారి పాట సినిమా చూసిన ప్రభాస్‌.. మహేశ్‌ నటనపై సంచలన వ్యాఖ్యలు!!

Sarkari Vaari Paata Prabhas: దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత విడుదలైన ప్రిన్స్‌ మహేశ్‌బాబు సినిమా సర్కారు వారి పాట. సినిమాపై డిఫెరెంట్‌ టాక్‌ వస్తోంది. కొందరు సినిమారి సూపర్‌ అంటుంటే మరికొందరు ప్లాప్‌ అని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో డార్లింగ్‌ ప్రభాస్‌ సర్కారువారి పాట సినిమాపై రివ్యూ ఇచ్చారు.

Sarkari Vaari Paata Prabhas
Prabhas

ప్రస్తుతం ఏ నోట విన్నా సర్కారు వారి పాట సినిమా గురించే మాట్లాడుతున్నారు. సినిమా బావున్నా.. కొందరు మాత్రం దానిపై నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. సినిమా ప్లాప్‌ అంటూ.. ట్విట్టర్‌లో యాంటీ మహేష్‌ బాబు టీం.. వైరల్‌ చేస్తోంది. అదే సమయంలో మహేష్‌ ఫ్యాన్స్ సినిమా సూపర్‌ అంటూ కామెంట్లుపెడుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. సెలబ్రిటీలు సైతం మహే‹శ్‌ బాబు సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సర్కారు వారి పాట సినిమలో మహేశ్‌ ఎలా నటించాడా ? అన్న ఆసక్తితో ఆ సినిమా చూసేందుకు పలువురు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. తాజాగా మహేశ్‌ బాబు సినిమాపై ప్రభాస్‌ రివ్యూ ఇచ్చినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. డార్లింగ్‌ శుక్రవారం రాత్రి ప్రత్యేక స్క్రీన్‌ ఏర్పాటు చేసుకొని మరీ సర్కారువారి పాట సినిమా చూశారని ప్రభాస్‌ సన్నిహితులు చెబుతున్నారు.

Also Read: Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మార్పు దేనికి సంకేతం?

-పాజిటివ్‌ కామెంట్స్‌.. 

మహేష్‌ సినిమా చాలా బావుందని, మహేష్‌ నటన తనకు నచ్చిందని ప్రభాస్‌ అన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో మహేష్‌ బాబు కామెడీ టైమింగ్‌ మరియు ఫైట్స్‌ కూడా నచ్చాయని.. వాటిని బాగా ఎంజాయ్‌ చేసినట్లు డార్లింగ్‌ చెప్పాడట.. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఈ స్టార్‌ హీరోల అభిమానులు మాత్రం ఈ విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

-ప్రిన్స్‌తో డార్లింగ్‌కు ఫ్రెండ్‌షిప్‌.. 

మహేష్‌ బాబు, ప్రభాస్‌ మధ్య సాన్నిహిత్యం ఉన్న విషయం అందరికి తెలిసిందే. ప్రభాస్‌ నటించిన ‘వర్షం’ ఆడియో ఫంక్షన్‌కు చీఫ్‌ గెస్టుగా మహేష్‌ బాబు అప్పట్లో హాజరయ్యాడు. ఆ తర్వాత ఇటీవలే ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసినప్పుడు వీరిద్దరూ కలిసి కనిపించారు. ప్రస్తుతం మహేష్‌ సినిమాపై ప్రభాస్‌ ప్రశంసలు కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

-డిఫరెంట్‌ టాక్‌.. 

మహేష్, కీర్తి సురేష్‌ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాకు డైరెక్టర్‌ పరుశురామ్‌.. దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కీర్తి నటన అందరితో వావ్‌ అనిపించింది. ఇక మహేష్‌ కామెడీ కూడా ఆకట్టుకుంది. ఈనెల 12న సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో రిలీజ్‌ అయ్యింది. ఎస్‌ఎస్‌.థమన్‌ సంగీతం అందించగా.. నదియా, సముద్ర ఖని, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మూడు రోజులుగా సినిమాపై డిఫరెంట్‌ టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికీ ప్రేక్షకులు హిట్, ప్లాప్‌పై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. దీంతో సినిమా చూసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. శని, ఆదివారాలు వీకెండ్‌ కావడంతో మరింతమంది సినిమా చూస్తారని నిర్మాతలు భావిస్తున్నారు.

Also Read: AP Chief Election Officer: ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ మార్పు: దేనికి సంకేతం… అలా ముదుకు వెళ్తారా? సాధారణమేనా?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular